Movies15 సంవత్సరాల తరువాత కని విని ఎరుగని క్రేజీ కాంబో.. ప్రభాస్...

15 సంవత్సరాల తరువాత కని విని ఎరుగని క్రేజీ కాంబో.. ప్రభాస్ సినిమాలో అందాల ముద్దుగుమ్మ.. !?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు భళే సెట్ అవుతాయి. సినిమా హిట్ అవ్వకపోయినా సరే వాళ్ల జంట తెరపై అభిమానులకు తెగ నచ్చేస్తుంది. అలా అభిమానుల చేత శభాష్ అనిపించుకున్న జంటే ప్రభాస్ – నయనతార . 2007లో యోగి సినిమాతో జత కట్టిన ఈ జంట త్వరలోనే మళ్లీ తెరపై కనిపించబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది .

దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఈ కాంబోను సెట్ చేశాడు క్రేజీ డైరెక్టర్, అర్జున్ రెడ్డి సినిమాతో సినిమా ఇండస్ట్రీలో కొత్త లెక్కలను తీసుకొచ్చిన సందీప్ వంగా.. డైరెక్షన్లో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో ప్రకటించిన ఈ సినిమాకు స్పిరిట్ అనే పేరు కూడా కన్ఫామ్ చేశారు. కాగా అందుతున్న సమాచారం ప్రకారం వేసవిలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది .ఈ క్రమంలోనే సినిమాలో హీరోయిన్ కోసం సెట్ చేస్తుండగా కథ ప్రకారం ఈ సినిమాలో నయనతార అయితే హీరోయిన్గా బాగుంటుంది అని పలువురు సలహా చేశారట.

ఇదే క్రమంలో ప్రభాస్ సైతం నయనతార పేరుకు ఓటు వేయడం ఇంట్రెస్టింగ్గా మారింది . అంతేకాదు ఇదివరకు ఈ రోల్ కోసం కరీనాకపూర్ ని సెలెక్ట్ చేశారట . అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ పక్కన ఆంటీ నా..? అని మండి పడటంతో ఆ రోల్ నయనతారకు దక్కిన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా సరే ప్రభాస్- నయనతార తెర పై మళ్ళీ కనిపిస్తున్నారు అని తెలియడంతో రెబెల్ ఫాన్స్ లో కొత్త ఉత్సాహం ఊపందుకుంది. చూడాలి మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news