Moviesఅప్పుడు తమన్నా ఇప్పుడు శ్వేత బసు..అదే కొంప ముంచే తప్పు..!!

అప్పుడు తమన్నా ఇప్పుడు శ్వేత బసు..అదే కొంప ముంచే తప్పు..!!

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో చెప్పలేమంటుంటారు సినీ ప్రముఖులు. ఎస్ అది నిజమే అంటూ మరోసారి ప్రూవ్ చేసింది శ్వేతా బసు ప్రసాద్ . కొత్త బంగారులోకం సినిమాతో ఓ రేంజ్ లో అల్లాడించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత చేసిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే ఇప్పటికీ శ్వేతా బసు అందాలకి పడిపోయే కుర్రాళ్ళు ఎంతో మంది ఉన్నారు.

అంత ఎందుకు మొన్నటికి మొన్న ఆమె ఓ ప్రెస్ మీట్ పెడితే జనాలు ఎగబడి మరి ఆమెతో సెల్ఫీలు ..ఆటోగ్రాఫర్లు అంటూ రెచ్చిపోయారు . అలా ఉంటుంది శ్వేతా బసు అందాలు. కాగా చాలా సంవత్సరాళ్ల గ్యాప్ తరువాత శ్వేతా బసు చేస్తున్న సినిమా లాక్ డౌన్ . డైరెక్టర్ మధు బంధర్కర్.. ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. మధు బండార్కర్ గతంలో తమన్నతో బబ్లీ బౌన్సర్ అనే సినిమాను తీశాడు . ఈ సినిమా ఓటీడీలో రిలీజ్ అయింది . డిజాస్టర్ గా మారింది .

కాగా ఇప్పుడు ఆ లిస్టులోకి యాడ్ అవ్వబోతుంది శ్వేతా బసు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . ఇప్పటికే లాక్ డౌన్ పేరుతో చాలా సినిమాలు వచ్చాయి. ఆ కాన్సెప్ట్ అందరికీ బోర్ కొట్టేసింది . మళ్లీ అదే కాన్సెప్ట్ తీసుకొచ్చి పాత చింతకాయ పచ్చడి లాగా అదే మూవీని తిరిగి తెరకెక్కిస్తే ఎవరు చూస్తారు.. సో కచ్చితంగా ఇది కూడా తమన్నా బబ్లి బౌన్సర్ లాగే డిజాస్టర్ గా మారుతుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . ఒకవేళ అదే నిజమైతే తమన్నా చేసిన తప్పే శ్వేత బస్సు కూడా చేసి ..తన కెరీర్ ని నాశనం చేసుకుంటుంది అంటున్నారు జనాలు . మరి చూడాలి చూద్దాం లాక్ డౌన్ సినిమా ఏ రేంజ్ లో అల్లాడిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news