Moviesఅంత మిడిసిప‌డిన పూజా హెగ్డేను.. ఇప్పుడు ఇంత లైట్ తీస్కొంటున్నారా..!!

అంత మిడిసిప‌డిన పూజా హెగ్డేను.. ఇప్పుడు ఇంత లైట్ తీస్కొంటున్నారా..!!

అదేంటోగానీ పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే కెరీర్ ఎప్పుడూ తేడాగానే సాగుతుంటుంది. కెరీర్ ప్రారంభంలో చేసిన రెండు తెలుగు సినిమాలు అమ్మడికి ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాయి. అయితే, నటిగా మాత్రం ఇటు మెగా అభిమానుల్లో అటు అక్కినేని అభిమానుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో తెలుగులో మంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ, హిందీ సినిమా ఛాన్స్ వచ్చిందని ఎగేసుకుంటూ బాలీవుడ్‌లో దూకుంది. కానీ, అక్కడ రెండేళ్ళు కష్టపడి చేసిన సినిమా అట్టర్ ఫ్లాపవడంతో గట్టి దెబ్బే తగిలింది.

ఇక అమ్మడి కెరీర్ మటాష్ అనుకున్న సమయంలో తెలుగులో క్రేజీ డైరెక్టర్ అయిన హరీష్ శంకర్ అలాగే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. దాంతో తెలుగులో చేసిన సినిమాలు బాగానే పాపులారిటీని తెచ్చిపెట్టాయి. ఇక్కడ ఆలస్యంగా సక్సెస్ దక్కినా కూడా ఏకంగా పాన్ ఇండియన్ హీరోయిన్‌గా మంచి ఆఫర్స్ అందుకుంది. కానీ, అవేవీ పూజా హెగ్డేకి సక్సెస్‌ను ఇవ్వలేదు. ఓవైపు రష్మిక మందన్న గట్టి పోటీ ఇస్తోంది.

అయినా పూజా వెనకబడుతూ తనకు వస్తున్న ఫ్లాప్స్ చూడకుండా భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసి మరీ తీసుకుంటున్నారు. పూరి జగన్నాథ్ సినిమాకి పూజా రు. 5 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటోందని టాక్ వినిపిస్తోంది. వ‌రుస అవ‌కాశాల‌తో ఆమె యాట్యిట్యూడ్ మారి మిడిసిప‌డింది… ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అవుతోంది. ఇంత ఆదరణ ఇస్తున్న తెలుగు సినిమాలను వదిలేసి అదే పనిగా బాలీవుడ్ ఇండస్ట్రీ మీద ఫోకస్ పెడుతుంది. అక్కడ అమితాబ్ బచ్చన్‌తో చేసిన యాడ్ బాగా పాపులర్ అయింది. కానీ, సినిమా కెరీర్ మాత్రం అంతగా కలిసి రావడం లేదు.

దీన్ని బట్టి చూస్తే అమ్మడికీ హిందీ ఇండస్ట్రీ పూజాకి కలిసి రాదనే మాట వినిపిస్తోంది. ఇప్పుడు పూరి జగన్నాథ్ సినిమా కూడా ఆగిపోయింది. చేతిలో నాలుగు సినిమాలున్నా కూడా అవేవి సక్సెస్ సాధిస్తాయో చెప్పడం కష్టం. అందుకే, పూజా హెగ్డేను బాలీవుడ్ మేకర్స్ లైట్ తీసుకుంటారా..? అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి హిందీలో అమ్మడు సల్మాన్ సరసన నటిస్తున్న సినిమా ఎంతవరకూ కలిసి వస్తుందో ? ఈసారి తేడా జరిగితే మాత్రం హిందీలో దాదాపు గేట్లు మూసేస్తారనుకోవచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news