Moviesనలుగురిలో డైరెక్టర్ చెత్త పని..ప్రభాస్ సీరియస్ వార్నింగ్ అందుకేనా.. వీడియో వైరల్..!?

నలుగురిలో డైరెక్టర్ చెత్త పని..ప్రభాస్ సీరియస్ వార్నింగ్ అందుకేనా.. వీడియో వైరల్..!?

ప్రజెంట్ సోషల్ మీడియాని ఓ వీడియో షేక్ చేస్తుంది. ఆ వీడియోలో జనాలు ఎప్పుడూ లేని ప్రభాస్ ని కోపంగా చూశారు . దీంతో రెబల్ ఫ్యాన్స్ సైతం ప్రభాస్ ఎందుకు అంత కోపంగా ఉన్నాడు అంటూ ఆలోచిస్తున్నారు. ఆ వీడియోలో ప్రభాస్ కోపంగా ఆది పురుష డైరెక్టర్ ఓం రావత్ ని వేలు పెట్టి చూపించడం రికార్డు అయింది. దీంతో ఈ వీడియో బాలీవుడ్ ని టాలీవుడ్ ని రేంజ్ లో షేక్ చేస్తుంది.


మనకు తెలిసిందే బాలీవుడ్ బడా డైరెక్టర్ ఓం రావత్ డైరెక్షన్లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ఆది పురుష్. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, కృతి కూడా నటించారు. కాగా ఎప్పుడో సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆదివారం నాడు అయోధ్యలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు. టీజర్ కి ఊహించిన స్థాయి రాకపోయినా.. ప్రభాస్ పెర్ఫార్మెన్స్ జనాలని ఆకట్టుకుంటుంది. అయితే చాలామంది ప్రభాస్ లుక్స్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ ని ఇలా చూపిస్తున్నాడు ఏంటి అంటూ కొందరు.. ప్రభాస్ ఒరిజినల్ ఫేస్ ల లేదు మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ లానే యానిమేషన్స్ తీశారు అంటూ మరికొందరు మండిపడుతున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ ఓం రావత్ ప్రభాస్ ని కూడా మోసం చేశారట. ఇలా చేస్తున్నానని చెప్పలేదట. అసలు టీజర్ పూర్తయ్యాక తనకు చూపించకుండానే ఇలా చేశాడని ..పెదనాన్న కార్యక్రమాలల్లో బిజీ గా ఉన్న ప్రభాస్ ని ఇలా ఓం రావత్ చీట్ చేసాడని..నిజానికి ప్రభాస్ కి కూడా టీజర్ నచ్చలేదని..రిలీజ్ అయిపోయాక తన రూమ్ లోకి వెళుతున్న టైం లో ప్రభాస్ ఓం రావత్ కి వార్నింగ్ ఇచ్చాడని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూశాక అభిమానులు కూడా “గడ్డిపెట్టు ఆ డైరెక్టర్ కి.. ఈ విధంగా చిత్రీకరిస్తాడా బుద్దుందా ..?”అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రభాస్ వేలు చూపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి చూడాలి ఈ వీడియో పై ప్రభాస్ ,ఓం రావత్ ఏ విధంగా స్పందిస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news