Moviesవావ్: ఒకే చోట పవర్ స్టార్-రెబల్ స్టార్.. అభిమానులకు పూనకాలు వచ్చే...

వావ్: ఒకే చోట పవర్ స్టార్-రెబల్ స్టార్.. అభిమానులకు పూనకాలు వచ్చే అప్ డేట్..!!

ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూస్తే ఎలా ఉంటుంది . అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి కధా. పిచ్చిపిచ్చిగా పిచ్చెక్కినట్టు ప్రవర్తించేస్తారు. అది అందరి అభిమానులకు ఉండేదే. ఇప్పుడు అలాంటి ఓ న్యూస్ నే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు బడా హీరోలు ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే అప్డేట్లతో మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నారు.

వామ్మో వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదూ . ఎస్ అలాంటి ఓ క్రేజీ అప్డేట్ ఇవ్వడానికి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రెబల్ హీరో ప్రభాస్ ఇద్దరు రెడీగా ఉన్నారు . లేటెస్ట్ న్యూస్ ప్రకారం వాళ్ళ సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్డేట్లు ఇవ్వడానికి ఇద్దరు స్టార్ హీరోస్ తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నట్లు తెలుస్తుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో భారీ సెట్లో జరుగుతుంది . ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ గుర్రపు స్వారీలతో పాటు.. హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ లో కూడా నటిస్తున్నట్లు తెలుస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్ కూడా పెదనాన్న మరణించిన బాధనుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ సల్లార్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు.

ఆశ్చర్యమేంటంటే సలార్ ఫైనల్ షూటింగ్ కూడా రామోజీ ఫిలిం సిటీ లోనే జరుగుతుంది . దాదాపు రెండు వారాలు ప్రభాస్ , పవన్ కళ్యాణ్ ఒకే చోట ఉండబోతున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈ షూటింగ్ టైంలో ఏ మాత్రం గ్యాప్ దొరికిన ఇద్దరు కచ్చితంగా మీట్ అవుతారు. ఒకవేళ అలాంటి మీటైన సందర్భంలో పిక్స్ సోషల్ మీడియాలో రిలీజ్ అయితే మాత్రం అభిమానులకు పూనకాలు రావడం పక్కా .అంతేకాదు ఎప్పటినుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రభాస్ కలిసి సినిమా చేయాలని ఇద్దరు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి చూద్దాం రామోజీ ఫిలిం సిటీ వేదికగా అలాంటి గుడ్ న్యూస్ చెప్తారు ఏమో .. ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news