Moviesప్ర‌భాస్ మిస్ అయ్యాడు.. ఎన్టీఆర్ బ్లాక్‌బస్ట‌ర్ కొట్టాడు.. ఆ సినిమా తెలుసా...!

ప్ర‌భాస్ మిస్ అయ్యాడు.. ఎన్టీఆర్ బ్లాక్‌బస్ట‌ర్ కొట్టాడు.. ఆ సినిమా తెలుసా…!

టాలీవుడ్‌లో వైజ‌యంతీ మూవీస్‌కు తిరుగులేని పేరు ఉంది. నాటి ఎన్టీఆర్‌తో మొదలు పెట్టి ఈ త‌రం స్టార్ హీరోలు అంద‌రితోనూ సినిమాలు తీసింది. ఈ త‌రం స్టార్ హీరోల్లో బ‌న్నీ, రామ్‌చ‌ర‌ణ్‌, నారా రోహిత్‌, మ‌హేష్‌బాబు లాంటి స్టార్ హీరోల‌ను వెండితెర‌కు ప‌రిచ‌యం చేసింది కూడా ఈ బ్యాన‌రే. అలాంటి బ్యాన‌ర్ మ‌హాన‌టి, సీతారామం, ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం, మ‌హ‌ర్షి లాంటి హిట్ సినిమాల‌తో ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉంది.

తాజాగా ఆయ‌న బ్యాన‌ర్ మీద వ‌చ్చిన సీతారామం సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. తెలుగులో హిట్ అయిన పెళ్లిసంద‌డి సినిమా హిందీలో తీశామ‌ని.. ఇక అల్లు అర‌వింద్ తాను క‌లిసి చూడాల‌ని ఉంది సినిమాను హిందీలో అనిల్ క‌పూర్ హీరోగా తీశామ‌ని… ఆ సినిమాకు అర‌వింద్‌కు, త‌న‌కు చెరో రు. 6 కోట్లు పోయాయ‌ని ఆయ‌న తెలిపారు.

ఇక ఎన్టీఆర్ హీరోగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన స్టూడెంట్ నెంబ‌ర్ 1 సినిమాను త‌మ బ్యాన‌ర్లోనే తీశామ‌ని.. అయితే ఈ సినిమాలో హీరోగా ముందుగా ప్ర‌భాస్‌ను అనుకున్నామ‌ని.. ఇంత‌లో హ‌రికృష్ణ ఎన్టీఆర్ హీరోగా మీ బ్యాన‌ర్లో ఓ సినిమా తీయ‌మ‌ని ఫోన్ చేయ‌డంతో అప్పుడు తార‌క్‌తోనే ఆ సినిమా తీసి హిట్ కొట్టామ‌ని అశ్వ‌నీద‌త్ చెప్పారు.

ఇక త‌న జీవితంలో చివ‌రి సినిమాగా జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి పార్ట్ 2 తీయాల‌ని ఉంద‌ని ఆయ‌న చెప్పారు. అదే త‌న‌కు ఆఖ‌రు సినిమా అనుకుంటున్నాన‌ని కూడా ఆయ‌న అన్నారు. ఇక శ‌క్తి సినిమా రిలీజ్ అయిన‌ప్పుడు తాను చాలా డిజ‌ప్పాయింట్ అయ్యాన‌ని.. అప్పుడే నాన్న కూడా చ‌నిపోయార‌న్నారు. ఏదేమైనా ప్ర‌భాస్ చేయాల్సిన బ్లాక్‌బ‌స్ట‌ర్ హ‌రికృష్ణ ఫోన్‌తో ల‌క్కీగా ఎన్టీఆర్‌కు ద‌క్కింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news