Moviesఆ దర్శకుడి చేతిలో దారుణంగా మోసపోయిన ఉదయభాను.... !

ఆ దర్శకుడి చేతిలో దారుణంగా మోసపోయిన ఉదయభాను…. !

ఇప్పుడంటే తెలుగు యాంకర్స్ లో సుమ కనకాల, అనసూయ భరద్వాజ్, ర‌ష్మిల హవా కనిపిస్తోంది కానీ …ఒకప్పుడు మాత్రం తెలుగులో ఉదయ భాను టాప్ యాంకర్ గా రాణించింది. డ్యాన్స్ బేబీ డ్యాన్స్, వన్స్ మోర్ ప్లీజ్ లాంటి టీవీ షోలతో పాటు పలు సూపర్ హిట్ షోలకు యాంకర్ గా వ్యవహరించింది. అప్పట్లో ఏ ఈవెంట్ జరిగినా అందులో యాంకర్ గా ఉదయ భానునే కనిపించేది. ఇక బుల్లితెర పై సక్సెస్ అయిన ఉదయభాను ఆ తరవాత వెండి తెర పై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఎర్రసైన్యం సినిమా తో ఉదయ భాను టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.

ఆ తరువాత వరుస ఆఫర్ లను అందుకుంది. ఓ వైపు టీవి షోలు చేస్తూ మరోవైపు సినిమాల్లోనూ నటించింది. అయితే సినిమాల్లో నటిస్తున్న సమయంలో ఉదయ భాను కూడా చాలా మంది నటీమణుల్లా ఇబ్బంది పడ్డారట. 2013లో ఉదయ భాను ఉదయ భాను రాజ్ శ్రీధర్ దర్శకత్వంలో మధుమతి అనే సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా లో కొన్ని బోల్డ్ సీన్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉదయ భాను డైరెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది అని తెలిసింది.

అంతే కాకుండా తనకు తెలియకుండా డైరెక్టర్ ఎక్స్ పోజింగ్ సీన్ లను తీశారని ఆరోపించింది. ఈ మ్యాటర్ అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. దాంతో ఆ తరవాత ఉదయ భాను ఏ సినిమా చేసినా కూడా ముందే ఆ సినిమాకు సంబందించిన విషయాలను పూర్తిగా అడిగి తెలుసుకునేదట. సినిమాలో ఎలాంటి సీన్ లు ఉంటాయి. బోల్డ్ సీన్ లు ఏమైనా ఉంటే నటించను అని ముందే క్లారిటీ ఇచ్చేదట. ఇక పెళ్లి తరవాత రీ ఎంట్రీ ఇచ్చిన ఉదయ భాను ప్రస్తుతం టీవి షోల తో పాటు సినిమా ఈవెంట్స్ లో కనిపిస్తుంది.

ప్ర‌స్తుతం ఉద‌య‌భాను ఇద్ద‌రు పిల్ల‌లు పెద్ద‌వాళ్లు కావ‌డంతో ఇటీవ‌ల మ‌ళ్లీ బుల్లితెర‌పై బిజీ అవుతోంది.
అంతే కాకుండా ఉదయ భాను త్వరలో బిగ్ బాస్ 6 లో మెరవబోతుంది అట‌. అందుకు గానూ అత్యధిక రెమ్యునరేషన్ పుచ్చుకుంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ బిగ్‌బాస్ సీజ‌న్లో ఏ కంటెస్టెంట్‌కు ద‌క్క‌ని రెమ్యున‌రేష‌న్ ఆమెకు ద‌క్కుతోంద‌ని కూడా టాక్ ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news