Moviesకొంప ముంచేసిన క్రష్మిక..సినిమా నుండి అవుట్..!?

కొంప ముంచేసిన క్రష్మిక..సినిమా నుండి అవుట్..!?

యస్ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నేషనల్ క్రష్ రష్మిక తన క్రేజీయస్ట్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు త్లుస్తుంది. మనకు తెలిసిందే ప్రజెంట్ శాండిల్ వుడ్ ,టాలీవుడ్ ,బాలీవుడ్ ,కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రష్మిక మందన .. మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. తన అద్భుతమైన నటనతో ..తన ఫిజిక్ తో తన అంద చందాలతో కుర్రాలను ఓ ఊపు ఊపేస్తున్న రష్మిక ప్రజెంట్ తెలుగు తమిళ్ కన్నా కూడా బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తుంది. బాలీవుడ్ బ్యూటీలకి కూడా దడ పుట్టిస్తుంది.


కాగా, పుష్ప హిట్ సినిమా తర్వాత నార్త్ ను ఏలేస్తున్న రష్మిక కు బాలీవుడ్ లో భారీ ఆఫర్ వచ్చినట్లు తెలిసింది. జాకీ ష్రాఫ్ కుమారుడు టైగర్ ష్రాఫ్ హీరోగా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేసిన్నట్లు మనకు తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించడానికి సంతకం కూడా చేసింది. స్క్రూ డీలర్ టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రం అఫీషియల్ గా కూడా ప్రకటించారు. దీంతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తుంది. దానికి కారణం రష్మిక మందన తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం అన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం కోసం హీరో టైగర్ ష్రాఫ్ రెమ్యూనరేషన్ 35 కోట్లు తీసుకుంటున్నాడు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అయితే నిర్మాత కరణ్ జోహార్ రెమ్యూనరేషన్ ని తగ్గించుకోవాలి అని హీరోకు స్పెషల్ రిక్వెస్ట్ చేశారట . 20 కోట్లు తీసుకొని సినిమా లాభాల్లో షేర్ తీసుకోమని కోరగా టైగర్ అందుకు తిరస్కరించారట.

సినిమా ఆగిపోవడానికి ఇదొక కారణం. అయితే రష్మిక మందన ఈ సినిమా కోసం డేట్ లను చాలా లేటుగా అడ్జస్ట్ చేసిందని తెలుస్తుంది. నిజానికి రష్మిక మందన చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయో మనకు తెలిసిందే. అన్ని బాలీవుడ్ సినిమాలు. కాగా ఇప్పుడు రష్మిక కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోతుందట. దీంతో సినిమా కోసం దాదాపు రెండు ఏళ్ళు ఆగేలా ఉందట. ఈ కారణంగా సినిమాను స్టాప్ చేయాలని నిర్ణయించుకున్నాడట నిర్మాత కరణ్ జోహార్. ఈ క్రమంలో రష్మిక బాలీవుడ్ లో సినిమా కోల్పోయింది అంటూ వార్తలు వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news