Moviesపెళ్లి చేసుకుని ఇద్దరి బిడ్డలని కనాలి అనుకున్నా..కానీ, సాయి పల్లవి ఇంట్రెస్టింగ్...

పెళ్లి చేసుకుని ఇద్దరి బిడ్డలని కనాలి అనుకున్నా..కానీ, సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

సాయి పల్లవి..ది వన్ అండ్ ఓన్లీ లేడీ టైగర్. చూడటానికి చక్కటి రూపం..అంతకుమించిన గొప్ప మనసు..దాని కన్నా కూడా అమ్మడు డ్రెసింగ్ స్టైల్ చాలా మందిని ఆకట్టుకుంటుంది. గ్లామరస్ రోల్స్ చేసే హీరోయిన్స్ కి లేని ఫ్యాన్ ఫాలొయింగ్ సాయి పల్లవికి ఉంది. ఇంచు మించు ఓ స్టార్ హీరో కి ఉన్న క్రేజ్ అమ్మడుకి ఉంది దానికి కారణం సాయి పల్లవి, పద్ధతులు..ఆమె నటించే విధానం..ఆమె వ్యక్తిగతం .

ప్రజెంట్ సాయి పల్లవి రానా హీరో గా నటిస్తున్న విరాటపర్వం సినిమాలో లీడ్ రోల్ చేస్తుంది. వేణు ఉడుగుల తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 17 న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ట్రైలర్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సాయి పల్లవి నటన సూపర్బ్ అంటున్నారు ఫ్యాన్స్. కధ కూడా కొత్త గా ఉండటంతో సినిమా పై మంచి బజ్ ఏర్పడింది.

కాగా సాయి పల్లవి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా..ప్రముఖ ఛానెల్ కు ఇంటర్వ్యు ఇచ్చింది. ఈ ఇంటర్వ్యుల్లో ఆమె మాట్లాడుతూ..తన పరసనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను చాలా అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలోనే తన పెళ్లి గురించి మాట్లాడుతూ..”నిజానికి నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో 23ఏళ్లకే మ్యారేజ్‌ చేసుకుని.. 30ఏళ్లు వచ్చేసరికి ఇద్దరు పిల్లల్ని కనాలని అనుకున్నిందట.

కానీ, సినిమాలోకి ఎంటర్ అయ్యాక మాత్రం..కధ మొత్తం రివర్స్ అయ్యిందని..ఇప్పుడు తన కాన్ సెన్ ట్రేషన్ అంతా..సినిమాల పైనే ఉందని”.. చెప్పుకొచ్చింది. చిరంజీవి గురించి మాట్లాడుతూ..” ఆయన డాన్సులంటే ఇష్టమని, ముఠామేస్త్రి సినిమాలో ఓయిరబ్బా.. అనే పాటకి డాన్సులేయడానికి చాలా సార్లు ప్రయత్నించా అని..కానీ వెర్య్యలేకపోయానని ” చెప్పుకొచ్చింది. దీంతో సాయి పల్లవి ఇంటర్వ్యుకి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news