Moviesవిగ్నేశ్ ని వదిలేసి హనీమూన్ నుండి డైరెక్ట్ గా అక్కడికి వెళ్లిపోయిన...

విగ్నేశ్ ని వదిలేసి హనీమూన్ నుండి డైరెక్ట్ గా అక్కడికి వెళ్లిపోయిన నయన్..ఇదేం సెంటిమెంట్ రా బాబు..!!

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార-కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ఈ మధ్యనే ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తమిళనాడులోని మహాబలిపురంలో ఓ రిసార్ట్ లో గ్రాండ్ గా పెళ్ళి చేసుకుని ఒక్కటైయ్యారు. ఇక పెళ్లి తరువాత తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఈ జంట.. ఆ తరువాత హనీమూన్ కోసం ధాయ్ ల్యాండ్ వెళ్లి అక్కడ కొన్ని రోజులు సరదాగా గడిపారు.

థాయిలాండ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ డైరెక్టర్ విగ్నేష్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఆ పిక్స్ లో నయన్ టూ హాట్ గా చాలా అందంగా కనిపించింది. తాజాగా థాయ్‌లాండ్‌కు హానీమూన్‌ వెళ్లిన ఈ కొత్త జంట తిరిగి వచ్చారు. అయితే, రావడం రావడమే నయన్ డైరెక్ట్ గా ముంబైలో జరుగుతున్న షారుఖ్ , అట్లీ సినిమా షూటింగ్ కు వెళ్లిపోయింది.

మనకు తెలిసిందే తమిళ డైరెక్టర్‌ అట్లీ, బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్ కాంబినేషన్‌లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న జవాన్ సినిమా లో నయనతార హీరోయిన్ గా సెలక్ట్ అయ్యింది. ప్రజెంట్ ముంబైలో షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ సినిమా లో నయన్ షెడ్యూల్స్ ఉండటంతో హానీమూన్‌ నుంచి తిరిగొచ్చిన వెంటనే షూటింగ్‌ కోసం ముంబై వెళ్ళిపోయింది. అయితే హానీమూన్‌ నుంచి వచ్చిరాగానే నవ వధువు నయనతార షూటింగ్‌ సెట్‌లో అడుగు పెట్టేసింది. పెళ్ళి తరువాత ఫస్ట్ టైం…అందులోను బాలీవుడ్ డెబ్యూ సినిమా కావడం తో ఈ సినిమా హిట్ అవుద్దనే సెంటిమెంట్ పెట్టుకున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news