Moviesమైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్‌.. ప‌విత్రా లోకేష్ ఇద్ద‌రు భ‌ర్త‌ల‌తో విడిపోయిందా......

మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్‌.. ప‌విత్రా లోకేష్ ఇద్ద‌రు భ‌ర్త‌ల‌తో విడిపోయిందా… న‌రేష్‌ను చేసుకుంటే మూడో భ‌ర్తా ?

ఏదేమైనా గ‌త వారం రోజుల నుంచి సీనియ‌ర్ న‌టుడు న‌రేష్‌, సీనియ‌ర్ న‌టి ప‌విత్రా లోకేష్ ప్రేమ‌య‌ణం, పెళ్లి గురించి వార్త‌లు ఒక‌టే వైర‌ల్ అవుతున్నాయి. అటు న‌రేష్ కూడా పెళ్లిపై పెద్ద వేదాంతం చెప్పాడు. సినిమా వాళ్ల‌కు పెళ్ల‌మే మొద‌టి భార్య అని… దానిని అర్థం చేసుకుని భార్య‌లు క‌లిసి ఉండ‌లేరంటూ చాలానే చెప్పాడు. అలాగ‌ని ప‌విత్రా లోకేష్‌తో త‌న పెళ్లి వార్త‌ల‌ను ఖండించ‌నూ లేదు. కొద్ది రోజుల వ‌ర‌కు న‌రేష్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు రెండు పెళ్లిళ్లు మాత్ర‌మే జ‌రిగాయ‌ని.. ప‌విత్ర‌ను చేసుకుంటే మూడో పెళ్లి అవుతుంద‌నే అన్నారు. ఇంత‌లో సెడ‌న్ ట్విస్ట్ వ‌చ్చింది. న‌రేష్‌కు ఇప్ప‌టికే మూడు పెళ్లిళ్లు అయిపోయాయ‌ని.. ర‌మ్య ర‌ఘుప‌తి ఆయ‌న‌కు మూడో భార్య అన్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ లెక్క‌న ప‌విత్ర‌ను చేసుకుంటే నాలుగో భార్య అవుతుంద‌నే అంద‌రూ అనుకున్నారు.

ఇంత‌లో మ‌రో ట్విస్ట్ అటు ప‌విత్రా లోకేష్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఒక పెళ్లే అయ్యింద‌ని.. క‌న్న‌డ సీరియ‌ల్ న‌టుడు సుచేంద్ర ప్ర‌సాద్‌ను ఆమె పెళ్లి చేసుకుని ఇద్ద‌రు పిల్ల‌ల‌ను కంద‌ని అన్నారు. అయితే తాజాగా క‌న్న‌డ మీడియా క‌థ‌నాల ప్ర‌కారం మ‌రో షాకింగ్ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప‌విత్రా లోకేష్‌కు కూడా ఇప్ప‌టికే రెండు పెళ్లిళ్లు అయిపోయాయి. ఈమె పెళ్లిళ్ల‌లో కూడా అదిరిపోయే ట్విస్టులు ఉన్నాయి. ఒక్క‌సారి ప్లాష్‌బ్యాక్‌లోకి వెళితే 2003లో ఈటీవీ క‌న్న‌డ‌లో గుప్తగామిని అనే సీరియ‌ల్ ప్ర‌సారం అయ్యింది.

ఈ సీరియ‌ల్ ట్విస్ట్ ఏంటంటే ఇద్ద‌రు అక్కాచెళ్లెల్లు ఒక‌రికి తెలియ‌కుండా మ‌రొక‌రు ర‌హ‌స్యంగా ఒకే వ్య‌క్తిని పెళ్లాడ‌తారు. అలా సాగ‌దీసి ఆరేళ్ల పాటు ఈ క‌థ‌ను న‌డిపించారు. ఈ రెండు పాత్ర‌ల‌ను ప‌విత్ర‌, మ‌ల్లిక పోషించారు. ఇందులో హీరోగా చేసిన సుచేంద్ర ప్ర‌సాద్ , ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు ముందు మ‌ల్లిక‌తో ప్రేమ‌లో ప‌డ్డాడు. పెళ్లి చేసుకున్నారు. క‌ట్ చేస్తే సీరియ‌ల్ అయిపోయే టైంకు మ‌ల్లిక‌కు విడాకులు ఇచ్చేసి ప‌విత్ర‌పై మ‌న‌సు పారేసుకుని ఆమెనే పెళ్లి చేసుకున్నాడు.

ఇక్క‌డే మ‌రో ట్విస్ట్ ఉంటే అప్ప‌టికే ప‌విత్ర‌కు ముందు ఓ పెళ్ల‌య్యింది. ఆమె సీరియ‌ల్స్‌లో న‌టిస్తోన్న టైంలో బెంగ‌ళూరు – హైద‌రాబాద్ మ‌ధ్య ఎక్కువుగా తిరిగేది. ఈ టైంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌తో ఆమెకు పెళ్ల‌య్యింది. యేడాదికే విడిపోయారు. ఇక ప‌విత్ర – సుచేంద్ర క‌లిసి కొన్నాళ్లు కాపురం చేసి ఇద్ద‌రు పిల్ల‌ల‌ను క‌న్నారు. మ‌రి మ‌ల్లిక ఏమైపోయిందో తెలియ‌దు.

ఇక ఇప్పుడు సుచేంద్ర‌కు , ప‌విత్ర‌కు ఎక్క‌డో తేడా కొట్టేసింది. ఇద్ద‌రు వేర్వేరుగానే ఉంటున్నారు. త్వ‌ర‌లోనే విడాకులు అంటున్నారు. ఇక ఇప్పుడు మ‌ల్లిక వ‌య‌స్సు 42 – 43లో ఉంది. 62 ఏళ్ల న‌రేష్‌కు ద‌గ్గ‌రైంది. ఇక న‌రేష్ సంగ‌తి పైన చెప్పుకున్నాం.. ఆయ‌న‌కు ఇప్ప‌టికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ఇక ఇప్పుడు వీరిద్ద‌రు పెళ్లి చేసుకుంటే న‌రేష్‌కు నాలుగో పెళ్లి.. ప‌విత్ర‌కు మూడో పెళ్లి అవుతుంద‌న్న‌మాట‌. అయితే ఇందులో ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదంటున్నారు నెటిజ‌న్లు చెన్నైలో ఉన్న హీరోయిన్ వ‌నితా విజ‌య్‌కుమార్‌కు ఏకంగా నాలుగైదు పెళ్లిళ్లు అయిపోయాయంటున్నారు. అన్న‌ట్టు ప‌విత్ర మొద‌టి భ‌ర్త హైద‌రాబాదీ సాఫ్ట్‌వేరే అట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news