Moviesమ‌హేష్ సినిమా సీక్రెట్‌గా చూసేందుకు హైద‌రాబాద్‌లో సాయి ప‌ల్ల‌వి ఏం చేసిందంటే......

మ‌హేష్ సినిమా సీక్రెట్‌గా చూసేందుకు హైద‌రాబాద్‌లో సాయి ప‌ల్ల‌వి ఏం చేసిందంటే… (వీడియో)

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు న‌టించిన స‌ర్కారు వారి పాట చాలా స‌క్సెస్ ఫుల్‌గా ఫ‌స్ట్ వీక్ కంప్లీట్ చేసుకుంది. లాంగ్ వీకెండ్ రావ‌డంతో పాటు రెండు సంవత్స‌రాల త‌ర్వాత మ‌హేష్ థియేట‌ర్ల‌లో క‌న‌ప‌డడంతో టాక్ ఎలా ఉంది అని చూడ‌కుండా ఉత్త‌రాంధ్ర నుంచి సీడెడ్‌, నైజాం, క‌ర్నాట‌క‌.. ఓవ‌ర్సీస్ వ‌ర‌కు జ‌నాలు థియేట‌ర్ల‌కు పోటెత్తేశారు.

తొలి రోజు నుంచే స‌ర్కారు వారి పాట సినిమాను ప‌లువురు సెల‌బ్రిటీలు చూసి సినిమా సూప‌ర్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావుతో మొద‌లు పెట్టి ఎంతో మంది సినిమా చూసి సూప‌ర్ అని మెచ్చుకుంటున్నారు. మ‌ల్టీఫ్లెక్స్ లు మిన‌హా ఎప్పుడూ సింగిల్ స్క్రీన్ల‌లో సినిమా చూసేందుకు రాని మ‌హేష్ భార్య న‌మ్ర‌త సైతం ఓ సారి భ్ర‌మ‌రాంబ‌లో షో చూడ‌గా… రెండోసారి హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సంధ్య థియేట‌ర్లో సినిమా చూడ‌డంతో పాటు కేక్ క‌టింగ్‌లో పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి మ‌హేష్ స‌ర్కారు వారి పాట సినిమా చూసేందుకు చేసిన పని ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా చూడాలంటే ఆమె హైద‌రాబాద్‌లో ఏ థియేట‌ర్‌కు వెళ్లినా ప్రేక్ష‌కులు ఆమెను సింపుల్‌గా గుర్తు ప‌ట్టేస్తారు. అందుకే త‌న‌ను ఎవ్వ‌రూ గుర్తు ప‌ట్ట‌కుండా ఉండేందుకు సాయి ప‌ల్ల‌వి ముసుగు వేసుకుని మ‌రీ థియేట‌ర్‌కు వెళ్లింది.

హైదరాబద్ లోని పీవీఆర్‌ ఆర్‌కే సినీప్లెక్స్‌లో సాయి పల్లవి స‌ర్కారు వారి పాట సినిమా చూసింది. లోప‌ల‌కు వ‌చ్చేట‌ప్పుడు ఆమె ఫేస్‌కు మాస్క్ తో పాటు ముసుగు ధరించి వ‌చ్చింది. అయితే సినిమా చూసి బ‌య‌ట‌కు వ‌చ్చేట‌ప్పుడు మాత్రం ఆమె త‌న‌ను ఎవ్వ‌రూ గుర్తు ప‌ట్ట‌కుండా ముసుగు వేసుకుని ఫోన్లో మాట్లాడేస్తూ స్పీడ్‌గా న‌డుచుకుంటూ వెళ్లిపోయింది.

అయితే అక్క‌డున్న వారిలో ఎవ‌రో ఆమెను గుర్తు ప‌ట్టేసి వీడియో తీసేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇక సాయి ప‌ల్ల‌వి రానాతో న‌టించిన విరాట‌ప‌ర్వం త్వ‌ర‌లోనే రిలీజ్‌కు రెడీ కానుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news