Moviesకోట్లు పోగొట్టుకున్నాను... షాకింగ్ విష‌యాలు బ‌య‌ట పెట్టిన ప్ర‌భాస్‌..!

కోట్లు పోగొట్టుకున్నాను… షాకింగ్ విష‌యాలు బ‌య‌ట పెట్టిన ప్ర‌భాస్‌..!

పాన్ ఇండియా స్టార్‌, టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ప్ర‌భాస్ సినిమా వ‌స్తోంది అంటే ఇప్పుడు కేవ‌లం టాలీవుడ్ మాత్ర‌మే కాదు.. దేశ‌వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అంద‌రూ క‌ళ్లుకాయ‌లు కాచేలా వెయిట్ చేసే ప‌రిస్థితి వ‌చ్చేసింది. ప్ర‌భాస్ స్టామినా, ప్ర‌భాస్ రేంజ్ ఇప్పుడు మామూలుగా లేదు. దేశ‌వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు, యువ‌త కూడా ప్ర‌భాస్ అంటే ప‌డి చ‌స్తున్నారు. బాహుబ‌లి సీరిస్ సినిమాల‌తో పాటు సాహో సినిమా కూడా ప్ర‌భాస్ రేంజ్ దేశ‌వ్యాప్తంగా పాకేలా చేసింది. ఇప్పుడు త‌మిళ‌నాడు నుంచి అసోం వ‌ర‌కు, ముంబై టు కోల్‌కొత్తా, ఢిల్లీ ఇలా ఎక్క‌డ చూసినా ప్ర‌భాస్ మానియానే క‌నిపిస్తోంది.

సాహో త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన ఏ సినిమా కూడా థియేట‌ర్ల‌లోకి రాలేదు. ఈ క్ర‌మంలోనే ఈ నెల 11న వ‌స్తోన్న రాధే శ్యామ్ మానియా ఇప్పుడు సౌత్ టు నార్త్ అన్ని భాష‌ల్లోనూ క‌నిపిస్తోంది. గోపీచంద్‌తో జిల్ సినిమా తీసిన రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో యువీ క్రియేషన్స్ టి సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ భారీ బ‌డ్జెట్ సినిమాను నిర్మించాయి. వ‌డ్డీల‌తో క‌లుపుకుంటే రు. 250 కోట్లు ఈ సినిమాకు ఖ‌ర్చ‌య్యాయ‌ని అంటున్నారు. 1960వ ద‌శ‌కంలో యూర‌ప్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఓ వింటేజ్ ప్రేమ‌క‌థే రాధేశ్యామ్ అంటున్నారు.

రాధేశ్యామ్ ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా ఉన్న ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కె తో పాటు అమితాబ్‌తో క‌లిసి న‌టించే విష‌యాల‌పై ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు వెల్ల‌డించారు. తాను కోట్ల‌లో డ‌బ్బు పోగొట్టుకున్నాను అన్న విష‌యం చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చాడు. ప్రాజెక్ట్ కె లో అమితాబ్‌తో క‌లిసి చేస్తున్నాన‌ని.. ఆయ‌న‌తో క‌లిసి న‌టించాల‌న్న నా డ్రీమ్ నెర‌వేర‌బోతోంద‌ని ఆనందం వ్య‌క్తం చేశాడు. ఇక తాను చాలా సెటిల్‌గా ఎందుకు ఉంటానో ? కూడా ప్ర‌భాస్ చెప్పాడు.

తాను సెటిల్‌గా ఉండ‌డం వ‌ల్లే కోట్లాది రూపాయ‌లు న‌ష్ట‌పోయానని.. ఆ కార‌ణంతోనే తాను చాలా సినిమాలు న‌ష్ట‌పోయాన‌ని చెప్పాడు. ఇక ఇప్పుడు మారి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాన‌ని.. 2022తో పాటు 2023లోనూ నా నుంచి ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతాయ‌ని ప్ర‌భాస్ చెప్పాడు. తాను ప్రాజెక్ట్ లో ఓ సీన్‌లో న‌టించిన వెంట‌నే అమితాబ్ వ‌చ్చి న‌న్ను గ‌ట్టిగా కౌగిలించుకున్నారని.. అప్పుడు త‌న‌కు చాలా సంతోషం వేసింద‌ని చెప్పిన ప్ర‌భాస్ ఆయ‌న‌తో క‌లిసి మొత్తం 10 రోజుల పాటు యాక్ష‌న్ సీన్ల‌లో న‌టించాన‌ని చెప్పాడు.

ఇక రాజ‌మౌళికి, త‌న‌కు గొప్ప అనుబంధం ఉంద‌ని.. రాజ‌మౌళితో తాను మ‌రో సినిమా చేస్తున్న‌ట్టు కూడా ప్ర‌భాస్ చెప్పాడు. ఇక ప్ర‌భాస్ వ‌రుస‌గా రాధే శ్యామ్ త‌ర్వాత ఆదిపురుష్‌, ప్రాజెక్ట్ కె, ప్ర‌శాంత్ నీల్ సినిమా, మారుతి సినిమా ఇలా వ‌రుస పెట్టి సినిమాల‌ను లైన్లో పెట్టుకుంటూ వెళుతున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news