Moviesమెగా ఫ్యామిలీ ని టార్గెట్ చేసిన ఆ డైరెక్టర్..పెద్ద తప్పే చేశాడుగా..?

మెగా ఫ్యామిలీ ని టార్గెట్ చేసిన ఆ డైరెక్టర్..పెద్ద తప్పే చేశాడుగా..?

శర్వానంద్ హీరోగా .. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం..”ఆడవాళ్ళు మీకు జోహార్లు”. తిరుమల కీషోర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ..నేడు ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి..మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. శతమానం భవతి సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న శర్వా..ఇప్పటి వరకు మళ్ళీ హిట్ అనే పదాని వినలేదు. గత కొంత కాలంగా ఆ పదం కోసం తన ఖాతాలో ఓ బ్లాక్ బస్టర్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఆయన ఈ సినిమా పైనే చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నారు. కానీ రిజల్ట్ చూస్తే అలా అనిపించడం లేదు. ఈ సినిమా కూడా శర్వాకి నిరాశే మిగిల్చింది. కానీ నటన పరంగా మంచి మార్కులే వేయించుకున్నాడు.

నిజానికి ఈ సినిమా ట్రైలర్ పాటలు విన్నాక మూవీ పై బోలెడు ఎక్స్ పెక్ టేషన్స్ పెట్టుకున్నారు అభిమానులు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం అక్కడ అసలు మ్యాటర్ నే లేదు అని అంటున్నారు సినిమా చూసిన జనాలు. కామెడీ టైమింగ్ తో..మొదటి భాగాని నెట్టుకొచ్చిన డైరెక్టర్..సెకండ్ పార్ట్ లో మాత్రం..ఎమోషన్ సీన్స్ తెరకెక్కించి పెళ్లికి ఉన్న వాల్యు గురించి చెప్పాలి అని అనుకున్నాడు కానీ ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు అంటున్నారు నెటిజన్స్.

పైగా ఈ సినిమాలో పరోక్షంగా మెగాస్టార్ ఫ్యామిలీ కి సంబంధించి కొన్ని సీన్స్ ని తెరకెక్కించిన్నట్లు ఉంది అంటూ నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా సెకండాఫ్ లో ఖుష్బు శర్వా మధ్య వచ్చే సీన్స్ ఆ డైలాగ్స్ వింటే ఎవ్వరికైనా అదే అనిపిస్తుంది. రోటీన్ సినిమా స్టోరీ లైన్ ను చూస్ చేసుకున్నా ఇంకా కొంచెం కామెడీ ని పండించి..పెళ్లి చూపుల సీన్స్ ని రియలిస్టిక్ గా తీసుంటే సినిమా కొంచెం బెటర్ టాక్ ను సంపాదించుకునేది అంటూ నెటిజన్స్ వాళ్ళ రివ్యూ ఇస్తున్నారు. ఓవర్ ఆల్ గా చెప్పాలంటే ఇలాంటి సినిమా తీసి డైరెక్టర్ తప్పు చేశాడు..తన రేంజ్ సినిమా కాదు ఇది అని అంటున్నారు అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news