Moviesబిగ్ అప్డేట్: మెగా అభిమానులకు ట్రిపుల్ ధమాకా...ఇక రచ్చ రంబోలా !!

బిగ్ అప్డేట్: మెగా అభిమానులకు ట్రిపుల్ ధమాకా…ఇక రచ్చ రంబోలా !!

గత కొన్ని నెలలుగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూసిన భారీ చిత్రాలు సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ మాయదారి కరోనా మహమ్మారి కారణంగా అన్ని సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో కుటుంబంతో కలిసి పండగ చేసుకుంటూ తమ అభిమాన హీరోల సినిమాలు చూసేందుకు రెడీ అయిన ఫ్యాన్స్ బాగా అప్ సెట్ అయ్యారు. అయితే తాజాగా అలాంటి వారికి గుడ్ న్యూస్ అందిచారు ఆయా చిత్ర నిర్మాతలు. ఒకతి కాదు రెండు కాదు..ఏకంగా మూడు మెగా భారీ సినిమాల రిలీజ్ డేట్లను ప్రకటించారు.

దర్శక ధీరుడు జక్కన్న, యంగ్ టైగర్​ ఎన్టీఆర్​, మెగా పవర్ స్టార్​ రామ్​ చరణ్​ కాంబోలో భారీ మల్టీ స్టారర్​గా వస్తున్న చిత్రం ఆర్‌ఆర్ఆర్‌. ఈ సినిమా పై అభిమానుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసర్మ్ లేదు. అయితే మొదట ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరీ 7న రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ కుదరలేదు. ఆ తర్వాత ఈ సినిమాని మార్చి 18 లేదా ఏప్రిల్​ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ రీసెంట్ గా ఫైనల్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఇప్పుడు మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్​ స్పష్టం చేశారు.

ఇక అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలి భారీ మల్టీస్టారర్ గా నతించిన “భీమ్లానాయక్” సినిమా కూడా పలుసార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఇక తాజాగా “భీమ్లానాయక్” సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు టీం. ఏప్రిల్ 1 న గ్రాండ్ గా పవన్ కళ్యాణ్ “భీమ్లానాయక్” సినిమా ధియేటర్స్ లొ విడుదల కానుంది. ఇక ఎప్పటినుండొ పలు కారణాల చేత వాయిదా పడుతూ వస్తున్న కొరటాల శివ డైరెక్షన్ లో చిరంజీవి నటించిన “ఆచార్య” సినిమా కూడా ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇలా వరుస మెగా హీరోల సినిమాలు రిలీజ్ కు సిద్ధం కావడం తో అభిమానుల్లో ట్రిపుల్ జోష్ నెలకొంది. మరి చూడాలి ఈ సినిమాలు అభిమానుల అంచనాలను రీచ్ అవుతాయా లేవా అని..?

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news