Moviesఆ అగ్రిమెంట్ నిజమైతే..చై-సామ్ కలవాల్సిందే తప్పదట..?

ఆ అగ్రిమెంట్ నిజమైతే..చై-సామ్ కలవాల్సిందే తప్పదట..?

టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్ నాగచైతన్య-సమంత విడాకులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎవ్వరు ఊహించని విధంగా విడాకులు ప్రకటించి గుండెలు గుభేలుమనిపించారు. ఇక వీరు విడిపోయినప్పటికి మేము హ్యాపీగానే ఉంటున్నాము అంటూ అటు సమంత ఇటు చైతన్య ఇద్దరు పలు ఇంటర్వ్యుల్లో తెలియజేశారు. అయితే వీరి అభిమానులు మాత్రం..ఇంతటి లవ్లీ కపుల్ విడిపోకూడదని..ఏదైన సమస్య ఉంటే కూర్చోని సాల్వ్ చేసుకోవాలని నచ్చజెప్పుతున్నారు.

ఇక విడాకుల తరువాత ఇద్దరు సినిమాల పరంగా బిజీ అవుతూ మంచి మంచి స్టోరీ లైన్ ఉన్న సినిమాలను పడుతున్నారు. అయితే వీళ్లు విడిపోవడం వల్ల వీరు ఎంత బాధపడుతున్నారో తెలియదు కానీ..ఓ డైరెక్టర్ మాత్రం చాలా ఫీల్ అవుతుందట. ఎందుకంటే..వీరు కలిసి ఉన్నప్పుడు ఆ డైరెక్టర్ తో కలిసి ఓ సినిమా చేయడానికి అగ్రిమెంట్ రాసారట ఈ జంట. దీంతో ఇప్పుడు చైతన్య సమంత ఈ సినిమా చేయడానికి ఒప్పుకుంటారా లేదా అని ఆలోచిస్తుందట ఆ లేడీ డైరెక్టర్.

టాలీవుడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి సమంతతో ఓ బేబీ అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా షూటింగ్ టైంలోనే చైతన్య,సమంత ఇద్దరు కలిసి నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాం అని కమిట్ అయ్యారట. అంతేనా అగ్రిమెంట్ కూడా రాసారట. కానీ ఇప్పుడు సీన్ చూస్తే తేడా కొడుతుంది. ఇద్దరిలో ఎవరో ఒక్కరిదగ్గరకు వెళ్లి ఈ మాట చెప్పిన ఎలా రియాక్ట్ అవుతారో తెలియని పరిస్ధితి నెలకొంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news