Movies15 నిమిషాల సుఖం కోసం అలా చేస్తారా... రేణుదేశాయ్ ఫైర్‌..!

15 నిమిషాల సుఖం కోసం అలా చేస్తారా… రేణుదేశాయ్ ఫైర్‌..!

రేణు దేశాయ్ మాజీ హీరోయిన్. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మాజీ భార్య. 2000 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన బద్రి సినిమాతో వెండి తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత మూడేళ్లకు పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో వచ్చిన జానీ సినిమాలో కూడా హీరోయిన్‌గా నటించింది. ఆమె తెలుగులో నటించినవి ఈ రెండు సినిమాలే. ఈ రెండు సినిమాల్లో బద్రి సూప‌ర్ హిట్‌. జానీ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. ఆ త‌ర్వాత ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టారు. పిల్ల‌లు పుట్టాక ప‌వ‌న్ , రేణును అధికారికంగా వివాహం చేసుకున్నారు.

అయితే ప‌వ‌న్‌తో విడాకుల త‌ర్వాత రేణు త‌న పిల్ల‌లు, ఫ్యామిలీతో క‌లిసి పూణేలో నివాసం ఉంటోంది. ఇక రేణు ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ వ‌స్తుంది. త‌న‌కు సంబంధించిన విష‌యాల‌ను సోష‌ల్ మీడియా ద్వారా త‌న అభిమానుల‌తో షేర్ చేసుకుంటూ వ‌స్తోంది. ఇక తెలుగులో కొన్ని బుల్లితెర ప్రోగ్రామ్స్‌కు కూడా ఆమె జ‌డ్జ్‌గా ఉన్నారు. ఇక క‌రోనా టైంలో కూడా ఆమె ఎంతో మంది పేద‌ల‌ను ఆదుకున్నారు.

ఇక స‌మాజంలో త‌న చుట్టూ జ‌రిగే సంఘ‌ట‌న‌ల‌పై రేణు ఎప్ప‌టిక‌ప్పుడు సందిస్తూ ఉంటుంది. రేణుకు కూడా ప‌వ‌న్ అభిమానులు ఎప్పుడూ స‌పోర్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఆమె వ్య‌క్తిత్వాన్ని మ‌రోసారి పెంచేలా ఉన్నాయి. ఇటీవ‌ల కాలంలో ఎక్కువ మంది వెజిటేరియ‌న్లుగా మారుతున్నారు. జంతువుల‌ను చంపి తిన‌డం క‌రెక్ట్ కాద‌ని రియ‌లైజ్ అయ్యి వారు నాన్ వెజ్‌కు దూరంగా ఉంటున్నార‌ని.. అందుకే తాను కూడా వెజిటేరియ‌న్‌గా మార‌బోతున్నాన‌ని రేణు రాసుకు వ‌చ్చింది.

కేవ‌లం 15 నిమిషాల సుఖం కోస‌మే ఒక జంతువును.. దారుణంగా చంపి తిన‌డం క‌రెక్ట్ కాద‌ని తాను తెలుసుకున్నాన‌ని. అందుకే తాను శాఖాహారిగా మారిపోతున్నానంటూ రేణు పోస్టులో రాసుకు వ‌చ్చింది. ఏదేమైనా ఈ పోస్టు రేణు మ‌న‌స్త‌త్వం ఎంత సున్నితంగా ఉంటుందో మ‌రోసారి చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news