Moviesమీరు టైం పాస్ గాళ్లు అంటూ రెచ్చిపోయిన రానా..అసలు ఏమైందంటే..!!

మీరు టైం పాస్ గాళ్లు అంటూ రెచ్చిపోయిన రానా..అసలు ఏమైందంటే..!!

రానా దగ్గుబాటి, సాయిప‌ల్ల‌వి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాటపర్వం’. నక్సలిజం, రాజకీయం నిజజీవిత కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రివ‌ల్యూష‌న్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్ అనేది విరాటపర్వం సినిమాకు ట్యాగ్‌లైన్‌.

ఈ సినిమాలో హీరోయిన్ ప్రియమణి కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా, ఇప్పటివ‌ర‌కూ ఈ చిత్రంలోని ప్రధాన పాత్రధారుల‌కు సంబంధించి విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్టర్స్‌కు, రానా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ఫ‌స్ట్ గ్లింప్స్‌, సంక్రాంతి ప‌ర్వదినాన రిలీజ్ చేసిన రానా-సాయిప‌ల్లవి జంట పోస్టర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. నిజానికి ఇవ‌న్నీ ‘విరాట‌ప‌ర్వం’పై అంచ‌నాల‌ను పెంచి.. ఆడియన్స్‌లో, ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో క్రేజ్ తీసుకొచ్చాయి. రానా, సాయిప‌ల్లవి జోడీ చూడ‌చ‌క్కగా ఉంద‌ని అన్ని వ‌ర్గాల నుంచీ ప్రశంస‌లు వ‌చ్చాయి.

నక్సలిజం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. 1990లో మావోయిస్టుల పోరాటానికి సంబంధించిన కథతో ఈ సినిమా ఉండనుంది. అయితే ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారని మొదటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా త్వరలో ఓ ప్రముఖ డిజిటల్ సంస్థ స్ట్రీమింగ్ చేయనుందని టాక్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. అయితే మేక‌ర్స్ నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న రాక‌ముందే ఇలా వార్త‌లు రావ‌డంపై ట్విట‌ర్ ద్వారా స్పందించాడు రానా.

ఆయన ట్వీట్ చేస్తూ..‘ద‌య‌చేసి ఈ భాషా స‌మ‌స్య‌ల‌పై నాకు అవ‌గాహ‌న క‌ల్పించండి..ఏం టైం పాస్ గాళ్లు బ్రో మీరు’ అంటూ పోస్ట్ చేశాడు. విరాట‌ప‌ర్వం ఓటీటీ రిలీజ్ అంటూ న‌కిలీ వార్త‌ను ట్వీట్ చేసిన ఓ మీడియా సంస్థను ట్యాగ్ చేస్తూ రానా చేసిన రీట్వీట్ ఇపుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news