Moviesఆ ప్రాజెక్టు కోసం మూడురెట్లు ఎక్కువ పారితోషికం తీసుకున్న పూర్ణ..ఆహా తో...

ఆ ప్రాజెక్టు కోసం మూడురెట్లు ఎక్కువ పారితోషికం తీసుకున్న పూర్ణ..ఆహా తో మైండ్ బ్లోయింగ్ డీల్..?

ప్రస్తుతం ఓటిటి వేదికలు మంచి జోరు పైన ఉన్నాయి. స్టార్ హీరోయిన్ లు సైతం ఈ డిజిటల్ వేదికపై కనిపించటానికి ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కాజల్, సమంత, తమన్నా వంటి అగ్ర తారలు సైతం ఈ వేదికపై వెబ్ సిరీస్ లతో తమ హవా చాటారు. ఇపుడు ఇదే తరహాలో తెలుగమ్మాయి ఇషా రెబ్బా, పూర్ణ, పాయల్ రాజ్ పుత్ లు కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ లో వెబ్ సిరీస్ ల హవా కొనసాగుతోంది. ఆహా వీడియో ఇప్పటికే పలు కొత్త చిత్రాలను మరియు వెబ్ సిరీస్ లను అందించి, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

అయితే ఇప్పుడు మరొకసారి సరికొత్త తెలుగు ఒరిజినల్ షో ను తీసుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది. మాస్ ఎంటర్ టైన్మెంట్ మాస్టర్ డైరక్టర్ మారుతి మొట్ట మొదటి వెబ్ సిరీస్ 3 రోజెస్ సిరీస్ చేస్తోంది ఆహా. ఈ సిరీస్ కు మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. ఇందులో పాయల్ రాజ్ పుత్ – ఈషా రెబ్బా – పూర్ణ వంటి ముగ్గురు ముద్దుగుమ్మలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు డిజిటల్ స్పేస్ లో ముగ్గురు హీరోయిన్స్ తో చేస్తున్న తొలి ఫీమేల్ సెంట్రిక్ ఒరిజినల్ సిరీస్ ఇదేనని తెలుస్తోంది.

ఈ ప్రాజెక్టుపై ఇంట్రెస్టింగ్ వార్త ఒక‌టి ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్కర్లు కొడుతోంది. అది ఏమిటంటే.. ఈ వెబ్ సిరీస్ కోసం నటి పూర్ణ ఎకంగా తాను సినిమాలకు తీసుకునే రెమ్యూనరేషన్ కంటే మూడు రెట్టింపులు ఎక్కువగానే 3 రోజెస్ ప్రాజెక్టుకు పారితోషికంగా అందుకుంటున్నార‌ట‌.రెమ్యునరేష‌న్ ఎక్కువ‌గా వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టం వ‌ల్లే వెబ్ సిరీస్‌లో క‌నిపించేందుకు సిద్దమ‌య్యార‌ని టాక్‌ వినిపిస్తుంది. ల‌వ్, రొమాంటిక్ స‌న్నివేశాల‌తో, ముగ్గురు హీరోయిన్ల అందాల విందుతో సాగే టీజ‌ర్ ప్రేక్ష‌కుల్లో క్యూరియాసిటీని క‌లిగిస్తోంది. నవంబర్ 12న ఈ సిరీస్ ని ఆహా లో ప్రీమియర్ గా స్ట్రీమింగ్ ని పెట్టనున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news