Moviesఒక్కే వేదిక పై మెరవనున్న బన్నీ-ప్రభాస్.. అభిమానులకు పండగేగా..!!

ఒక్కే వేదిక పై మెరవనున్న బన్నీ-ప్రభాస్.. అభిమానులకు పండగేగా..!!

లెక్కల మాస్టర్ సుకుమార్‌.. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న సినిమా “పుష్ప”. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు,ఫస్ట్ లుక్ స్ అందరిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక దీంతో ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం పక్క అంటున్నారు అభిమానులు. అయితే ముచ్చటగా మూడోసారి క్రేజీ కాంబో అయిన సుకుమార్ బన్నీ హిట్ కొడితే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. డైరెక్టర్ సుకుమార్ ఈ ” పుష్ప” సినిమాని పాన్‌ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రష్మిక ఫస్ట్ టైం అల్లు అర్జున్ పక్కన డీ గ్లామరస్ రోల్ లో కనిపించ్నుంది. ఇక అల్లు అర్జున్ రాబోయే ‘పుష్ప’తో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదగాలని అనుకుంటున్నాడు. అందుకే ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నాడు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ తొలి పార్ట్ డిసెంబర్ 17న ఆడియన్స్ ముందుకు రానుంది.

ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడడంతో పుష్ప టీం ప్రమోషన్స్ పనులను స్పీడ్ అప్ చేసింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రానున్నారట. ‘బాహుబలి’ సీరీస్ తో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఈ ఈవెంట్ కి రానుండటం ప్యాన్ స్టార్ గా ఎదగాలనుకుంటున్న బన్నీకి కలసి వచ్చే అంశమే. డిసెంబర్ 12న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది.

ఇటీవల బాలకృష్ణ ‘అఖండ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ అల్లు అర్జున్ భలేగా సందడి చేశాడు. బాలయ్యకు అతిథిగా బన్నీ వెళితే ఇప్పుడు బన్నీకి అతిథిగా ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాబోతున్నాడట.ఇక ఈ సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందిని టాక్ వినిపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news