Moviesప్రియ‌మ‌ణి భ‌ర్త ఎవ‌రో తెలుసా... వీరి ప్రేమ ఎలా పుట్టిందంటే..!

ప్రియ‌మ‌ణి భ‌ర్త ఎవ‌రో తెలుసా… వీరి ప్రేమ ఎలా పుట్టిందంటే..!

సీనియ‌ర్ హీరోయిన్ ప్రియ‌మ‌ణికి కేవ‌లం తెలుగులో మాత్ర‌మే కాదు.. అటు త‌మిళ్‌, క‌న్న‌డ‌తో పాటు బాలీవుడ్‌లో కూడా కాస్తో కూస్తో పాపులారిటీ ఉంది. ఆమె అంద చందాల‌తో మాత్ర‌మే కాదు.. త‌న న‌ట‌న‌తో కూడా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ ఉంటుంది. తెలుగులో ప‌దేళ్లుగా కెరీర్‌ను ఎంజాయ్ చేసిన ఆమె స్టార్ హీరోలు అంద‌రితోనూ క‌లిసి న‌టించింది. రాజ‌మౌళి లాంటి స్టార్ డైరెక్ట‌ర్ల‌తో కూడా క‌లిసి ప‌ని చేసింది. ఇక పెళ్ల‌య్యాక కూడా ఆమె హీరోయిన్‌గా చేస్తూ కెరీర్‌ను కంటిన్యూ చేస్తోంది.

priyamani-engagement-photos

ఇటీవ‌లే సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ ప‌క్క‌న నార‌ప్ప సినిమాలో సుంద‌ర‌మ్మ‌గా అద‌ర గొట్టేసింది. ఇప్ప‌ట‌కీ కూడా ఆమెకు అవ‌కాశాలు వ‌రుస‌గా వ‌స్తున్నాయి. సీనియ‌ర్ హీరోల‌కు ప్రియ‌మ‌ణి మంచి ఆప్ష‌న్‌గా మారింది. ప్ర‌స్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోన్న ప్రియ‌మ‌ణి దీపావ‌ళి కానుక‌గా త‌న భ‌ర్త ముస్త‌పా రాజ్‌తో క‌లిసి ఓ ఫొటో పంచుకుంది. ప్రియ‌మ‌ణి భ‌ర్త ముస్త‌ఫా రాజ్ ఓ బిజినెస్‌మేన్‌.

అత‌డికి ముందే పెళ్ల‌య్యింది. అయితే ముందు భార్య‌కు విడాకులు ఇవ్వ‌కుండానే ప్రియ‌మ‌ణిని పెళ్లి చేసుకున్నాడ‌న్న కేసు ముస్త‌ఫా రాజ్ మీద ఉంది. ఇక ప‌లు షోల‌కు ముస్త‌ఫా రాజ్ నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అలా ఓ డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో ప్రియ‌మ‌ణికి, ముస్త‌ఫాతో ఏర్ప‌డిన ప‌రిచ‌యంతోనే వీరు ప్రేమికులు.. ఆ త‌ర్వాత దంప‌తులు అయ్యారు.

వీరు సింపుల్‌గా రిజిస్ట‌ర్ మ్యారేజ్ చేసుకున్నారు. ప్ర‌స్తుతం ప్రియ‌మ‌ణి బెంగ‌ళూరులో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ప్ర‌స్తుతం ప్రియమణి తెలుగులో సాయి పల్లవి – రానాతో క‌లిసి విరాట‌ప‌ర్వం సినిమా చేసింది. ఈ సినిమా త్వ‌ర‌లోనే రిలీజ్‌కు రెడీగా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news