Moviesఆ చివరి కోరిక తీరకుండానే మరణించిన వేణుమాధవ్..ఏంటో తెలిస్తే కన్నీరు...

ఆ చివరి కోరిక తీరకుండానే మరణించిన వేణుమాధవ్..ఏంటో తెలిస్తే కన్నీరు ఆగదు ..?

వేణు మాధ‌వ్.. తెలుగు తెర‌పై చెర‌గని ముద్ర వేసుకున్న ప్ర‌ముఖ క‌మెడీయ‌న్స్‌లో ఒక‌రు. వేణుమాధవ్ మిమిక్రీ ఆర్టిస్టుగా తన ప్రస్థానం మొదలు పెట్టారు. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా నటించిన ‘సంప్రదాయం’ సినిమాతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన ఆయనకు పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ‘తొలిప్రేమ’ సినిమాతో గుర్తింపు లభించింది. వేణు మాధవ్ మొత్తంగా 170కి పైగా సినిమాల్లో నటించారు.

హాస్యనటుడిగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన వేణు మాధవ్‌ 2019 సెప్టెంబర్‌ 25 చనిపోయారు. కేవలం 49 ఏళ్ళకే వేణు మాధవ్ అనారోగ్యంతో మరణించారు. టాలీవుడ్ సీనియర్ కమెడియన్ వేణు మాధవ్ చనిపోయి రెండేళ్ళవుతుంది. అయినా కూడా ఈయన మరణాన్ని అభిమానులు మరిచిపోలేకపోతున్నారు. ఆది, దిల్, సింహాద్రి, సై, లక్ష్మి, ఛత్రపతి.. ఇలా పలు సినిమాల్లో ఆయన పాత్రలు ప్రేక్షకులను బాగా అలరించాయి. ఆయన చివరిగా నటించిన చిత్రం 2016లో విడుదలైన డాక్టర్ పరమానందయ్య స్టూడెంట్స్ గ్యాంగ్. 2006లో ఉత్తమ హాస్య నటుడిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు. ఇప్పటికీ ఏదైనా సినిమాలో ఈయన కామెడీ వచ్చినపుడు మనసారా నవ్వుకుంటారు.

2019 సెప్టెంబర్ 25 న తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. అయితే ఆయన తన చివరి కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలు వెళ్లిపోయాడు. ఆ రోజుల్లో తన సొంత నియోజకవర్గం అయిన కోదాడ నుండి టీడీపీ ఎమ్మెల్యే గా పోటీ చేసి ప్రజలకు సేవ చేయాలని అనుకునే వారట. ఇది ఆయన మనసులో చివరి వరకు ఉన్న కోరిక అని తర్వాత తెలిసింది టీడీపీ నుండి ఎమ్మెల్యే గా పోటీ చెయ్యాలి అని ఆ ప్రయత్నంలో భాగంగానే 2014 లో నామినేషన్ కూడా వేశాడు. అయితే వివిధ కారణాల వలన నామినేషన్ మళ్లీ వెనక్కు తీసుకున్నాడు. ఏది ఏమైనా తన చివరి కోరిక తీరకుండానే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపొవడం చాలా బాధాకరం.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news