Newsప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు.. క‌ర్నూలు ల‌‌వ్ స్టోరీలో ట్విస్ట్‌

ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు.. క‌ర్నూలు ల‌‌వ్ స్టోరీలో ట్విస్ట్‌

వారిద్ద‌రు మూడు సంవ‌త్స‌రాలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. ఇంతలో ఏమైందో గాని ఆ ప్రియుడు ఆ ప్రేయ‌సిని కాద‌ని మ‌రో అమ్మాయి మెడ‌లో మూడు ముళ్లు వేసుకున్నాడు. కోపం ప‌ట్ట‌లేని ఆ ప్రియురాలు త‌న ప్రియుడిపై యాసిడ్ దాడి చేసింది. క‌ర్నూలు జిల్లాలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. క‌ర్నూలు జిల్లా నంద్యాల మండలంలో గురువారం ఈ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన నాగేంద్ర,  సుప్రియ మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి కులాలు వేరు. అయితే చివ‌ర్లో నాగేంద్ర మీ కులం  వేరు.. మా కులం వేరు.. మ‌న పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోర‌ని ఆమె ప్రేమ‌కు బ్రేక‌ప్ చెప్పాడు. ఆ త‌ర్వాత నెల రోజుల క్రిత‌మే మ‌రో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

దీంతో సుప్రియ ప్రియుడి వివాహాన్ని జీర్ణించుకోలేకపోయింది సుప్రియ. అతడిపై యాసిడ్‌ దాడికి పాల్పడింది. యాసిడ్‌ దాడిలో నాగేంద్ర ముఖం, చెయ్యి బాగా కాలిపోవటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు న‌మోదు చేసి విచారిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news