Moviesఆ భ‌యంతోనే రాగిణి ఇళ్లు అమ్మ‌కానికి పెట్టిందా... డ్ర‌గ్ కేసులో మ‌రో...

ఆ భ‌యంతోనే రాగిణి ఇళ్లు అమ్మ‌కానికి పెట్టిందా… డ్ర‌గ్ కేసులో మ‌రో ట్విస్ట్‌…!

క‌న్న‌డ సినిమా ప‌రిశ్ర‌మ‌ను ప్ర‌స్తుతం డ్ర‌గ్ ఉదంతం ఎలా భ‌య‌పెడుతోందో చూస్తూనే ఉన్నాం. ఇప్ప‌టికే ఈ కేసులో ఇద్ద‌రు హీరోయిన్లు సంజ‌నా గ‌ల్రానీ, రాగిణి ద్వివేదిల‌ను పోలీసులు అరెస్టు చేశారు. సంజ‌న‌పై ఇంకా విచార‌ణ కొనసాగుతూనే ఉండ‌గా.. రాగిణిని మాత్రం ప‌ర‌ప్ప‌న అగ్ర‌హారం జైలులో ఉంచారు. ఇదిలా ఉంటే ఈ కేసులో త‌వ్వేకొద్ది ఎంతో మంది పెద్ద త‌ల‌కాయ‌ల పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. రాగిణి ఎల‌హంక‌లో తాను ఎంతో క‌ష్ట‌ప‌డి, ఇష్ట‌ప‌డి కొనుక్కున్న ఇళ్లును అమ్మకానికి పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

 

 

అయితే రాగిణి ఆస్తులు అమ్మ‌కానికి పెట్టినా వాటిని కొనేందుకు మాత్రం ఎవ్వ‌రూ ముందుకు రావ‌డం లేద‌ట‌. అస‌లే డ్ర‌గ్ కేసులో రాగిణి ఇరుక్కుంది.. ఆమె ఆస్తులు కొంటే లేనిపోని చిక్కులు ఎక్క‌డ వ‌స్తాయో ? అని వాటిని కొనేందుకు ఎవ్వ‌రూ ముందుకు రావ‌డం లేదంటున్నారు. ఐటీ శాఖ ఇంట‌రాగేష‌న్‌తో రాగిణి విప‌రీతంగా భ‌య‌ప‌డుతోంద‌ని… అందుకే ఆమె ఆస్తుల‌న్నింటిని అమ్మ‌కానికి పెట్టేసింద‌ని అంటున్నారు.

 

రేప‌టి మ‌ళ్లీ ఈ డ్ర‌గ్ ఉదంతం త‌న‌ను వెంటాడుతుంద‌న్న భ‌యంతో రాగిణి ఉంద‌ట‌. అందుకే ఆమె ఆస్తుల‌న్నింటిని అమ్మేయాల‌ని చూస్తున్నా వాటిని ఎవ్వ‌రూ కొన‌డం లేదు. ఇక ఆమె బెయిల్ కోసం న్యాయ‌వాదులు విప‌రీతంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news