Newsప్రియురాలిని త‌గ‌ల‌బెట్టిన ప్రియుడు చేసిన ఘోరం ఇది...

ప్రియురాలిని త‌గ‌ల‌బెట్టిన ప్రియుడు చేసిన ఘోరం ఇది…

దారుణాల‌కు నిల‌యంగా మారిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో ఘోరం చోటు చేసుకుంది. ఓ యువ‌కుడు తాను ప్రేమించిన ప్రియురాలిని త‌గ‌ల‌బెట్టి అత‌డు కూడా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. యూపీలోని మకువా ఖేడా, మహువా గ్రామాల మధ్య శనివారం తెల్లవారుజామున స‌గం కాలిన స్థితిలో 24 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న యువ‌తి మృత‌దేహం గుర్తించారు. పోలీసుల విచార‌ణలో ఆ యువ‌తి అదే ప్రాంతానికి చెందిన రాంబాబు కుమార్తెగా అని గుర్తించారు. అయితే రాంబాబు మాత్రం శుక్ర‌వారం రాత్రి కూడా త‌న కుమార్తె త‌న ఇంట్లోనే ఉంద‌ని చెప్పారు.

అయితే ఆమె స్తానిక యువ‌కుడు అయిన ధీరేంద్ర రైదాస్‌తో ప్రేమలో ఉందని తెలిసి మందలించినట్లు చెప్పారు. శుక్ర‌వారం అర్ధ‌రాత్రి దాటాక క‌న‌ప‌డుండా పోయిన త‌న కుమార్తె ఉద‌యానికే శ‌వ‌మై క‌నిపించింద‌ని భోరున విల‌పిస్తూ చెప్పాడు. పోలీసులు ధీరేంద్రపై కేసు నమోదు చేసి అతడి కోసం గాలించారు. అయితే శనివారం ఉద‌యం 9 గంట‌ల‌కే అత‌డు రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

ప్రియురాలితో జ‌రిగిన వాగ్వివాదం త‌ర్వాత ముందు ప్రియురాలిని పెట్రోల్ పోసి తగులబెట్టి తరువాత ధీరేంద్ర ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news