Newsచ‌నిపోతున్నా అంటూ సోష‌ల్ మీడియాలో సూర్యాపేట యువ‌కుడు పోస్ట్‌.. షాకింగ్ క్లైమాక్స్‌

చ‌నిపోతున్నా అంటూ సోష‌ల్ మీడియాలో సూర్యాపేట యువ‌కుడు పోస్ట్‌.. షాకింగ్ క్లైమాక్స్‌

కుటుంబం దూరం పెట్ట‌డంతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువ‌కుడు తాను చ‌నిపోతున్నా అంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అంత‌లోనే షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తెలంగాణ‌లోని సూర్యాపేట జిల్లా  చివ్వెంల మండలం బండమీదిచందుపట్లకు చెందిన మధుసూదన్‌రెడ్డి మాజీ కానిస్టేబుల్‌. గతంలో అన్నెపర్తి బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించాడు. అయితే సైకోలా మారి ఇంట్లో వాళ్ల‌ను ఇబ్బంది పెడుతుండ‌డంతో ఇంటి స‌భ్యులు అత‌డిని ప‌ట్టించుకోవ‌డం మానేశారు.

జీవితంపై విర‌క్తి చెందిన అత‌డు తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇది జోరుగా వైర‌ల్ అయ్యింది. ‌ ఈ విషయాన్ని ఓ కేసు విషయంలో చందుపట్లకు వెళ్లిన ఎస్సై లోకేష్‌కు గ్రామస్థులు తెలిపారు. దీంతో సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ ఆధారంగా మధుసూదన్‌ రెడ్డి కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లిన పోలీసు బృందం మధుసూదన్‌రెడ్డిని రక్షించి కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news