Gossipsఆ ముదురు హీరోయిన్ వెంట ప‌డుతోన్న మ‌హేష్‌....!

ఆ ముదురు హీరోయిన్ వెంట ప‌డుతోన్న మ‌హేష్‌….!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ఈ యేడాది సంక్రాంతికి స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సూప‌ర్ హిట్ కొట్టాడు. ప్ర‌స్తుతం పెట్ల ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ స‌ర్కారు వారి పాట సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో కేఎల్‌. నారాయ‌ణ నిర్మించే సినిమాలో న‌టించ‌నున్నాడు. ఈ విష‌యాన్ని రాజ‌మౌళీయే అధికారికంగా చెప్పిన సంగ‌తి తెలిసిందే.

 

ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. అటు రాజ‌మౌళి మార్కెట్‌తో పాటు ఇటు మ‌హేష్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని భారీ బ‌డ్జెట్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే హీరోయిన్‌తో పాటు న‌టీన‌టుల‌ను పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న వాళ్ల‌నే తీసుకుంటున్నార‌ట‌. మ‌హేష్ ప‌క్క‌న ఈ సినిమాలో న‌య‌న‌తార‌ను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. ఆమెకు తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళంలో కూడా సూప‌ర్ క్రేజ్ ఉంది.

 

అందుకే న‌య‌న‌తార అయితేనే ఈ సినిమాకు హీరోయిన్‌గా క‌రెక్టుగా సెట్ అవుతుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌. న‌య‌న‌తార మాత్రం భారీగా డిమాండ్ చేస్తోంది. స్టార్ హీరోల ప‌క్క‌న చేయాలంటేనే ఆమె ఏకంగా రు. 4 కోట్ల వ‌ర‌కు డిమాండ్ చేస్తోంది. చిరంజీవి ప‌క్క‌న ఛాన్స్ వ‌చ్చినా ఆమె రేటు ద‌గ్గ‌ర తేడా వ‌చ్చే త‌ప్పుకుంది. మ‌రి ఇప్పుడు మ‌హేష్ సినిమాకు అయినా కండీష‌న్లు లేకుండా ఓకే చెపుతుందేమో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news