Moviesత‌మ‌న్నా ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం.. తీవ్ర ఆందోళ‌న‌తో పోస్టు పెట్టిన మిల్కీ...

త‌మ‌న్నా ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం.. తీవ్ర ఆందోళ‌న‌తో పోస్టు పెట్టిన మిల్కీ బ్యూటీ

క‌రోనా సెల‌బ్రిటీలను వ‌ద‌ల‌కుండా వెంటాడుతోంది. సినిమా, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు క‌రోనా భారీన ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ సినీ న‌టి, మిల్కీబ్యూటీ త‌మ‌న్నా త‌ల్లిదండ్రులు క‌రోనా భారీన ప‌డ్డారు.  ఈ విష‌యాన్ని ఆమే స్వ‌యంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించింది. ఆమెకు క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో వెంట‌నే కోవిడ్ పరీక్ష‌లు చేయించగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది.

అయితే త‌న‌తో పాటు మిగిలిన కుటుంబ స‌భ్యులు అంద‌రికి మాత్రం క‌రోనా నెగిటివ్ వ‌చ్చింద‌ని చెప్పిన త‌మ‌న్నా త‌ల్లి దండ్రుల‌కు పాజిటివ్ రావ‌డంతో కాస్త టెన్ష‌న్‌గా ఉన్నా మీ అందరి ప్రేమాభిమానాలతో వారు త్వరగా కోలుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఇప్ప‌టికే క‌రోనా భారీన ప‌డ్డ సినీ ఫ్యామిలీల్లో అమితాబ్ ఫ్యామిలీ, రాజ‌మౌళి ఫ్యామిలీ కోలుకున్న సంగ‌తి తెలిసిందే.

ఇక క‌రోనాతో ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతున్నారు. చెన్నై ఎంజీఎం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోన్న ఆయ‌న ఎట్ట‌కేల‌కు రిక‌వ‌రీ అయ్యారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news