Moviesసుశాంత్ కేసు విచార‌ణ‌పై బీజేపీ కీల‌క నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సుశాంత్ కేసు విచార‌ణ‌పై బీజేపీ కీల‌క నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్ప‌ద మృతి బాలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ఎంతో ఫ్యూచ‌ర్ వున్న హీరో అర్థాంత‌రంగా త‌నువు చాలించ‌డం ప‌ట్ల స‌గ‌టు అభిమాని ఆవేద‌న‌కు గుర‌వుతున్నాడు.  యావ‌వ‌త్ భార‌తం ప్ర‌స్తుతం సుశాంత్ కేసు ఏ మ‌లుపు తిరిరుగుతుంది ? ఎవ‌రి ర‌హ‌స్యాలు బ‌ట్ట‌బ‌య‌ల‌వుతాయి ?  సుశాంత్ మృతి వెన‌క ఎలాంటి కుట్ర జ‌రిగింది? ఆ కుట్ర వెన‌క వుంది రియానా ?  లేక ఆమె వెన‌క వేరే ఎవ‌రైనా వున్నారా? అనే ప్ర‌శ్న‌లు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇదిలా వుంటే బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్శ‌ద‌ర్శి ముర‌ళీధ‌ర్‌రావు సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా వ‌రుస ట్వీట్ చేయడం సంచ‌ల‌నంగా మారింది. భార‌త‌దేశ ప్ర‌జ‌లు ఈ కేసును ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నార‌ని, ఈ కేసు చుట్టూ ప‌లు అనుబంధ‌ కేసులు పుట్టుకొస్తుండ‌టంతో సుశాంత్ సూసైడ్ కేసు ప‌రిధి పెరిగిపోయింద‌న్నారు. దీంతో జాతీయ ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఐ ఏ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవ‌కాశం వుంద‌న్నారు.

సుశాంత్ ఆత్మ హ‌త్య‌కు పాల్ప‌డ‌టం, హ‌ఠాన్మ‌ర‌ణంపై సీబీఐ ద‌ర్యాప్తు చేస్తోంద‌ని, ఇప్ప‌టికే మ‌నీ ల్యాండ‌రింగ్ మీద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ ద‌ర్యాప్తు చేస్తోంది. ఈ కేసు ని వివిద ద‌ర్యాప్తు సంస్థ‌లు ద‌ర్యాప్తు చేస్తుండ‌టంతో కేసు పెద్ద‌దుద‌వుతూ వ‌స్తోంద‌ని ముర‌ళీధ‌ర్‌రావు వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

అంతే కాకుండా ఈ కేసుకు స‌హ‌క‌రిస్తున్న వారంతా సుశాంత్‌కు న్యాయం జ‌ర‌గాల‌ని, క్లీన్ బాలీవుడ్ ఉద్య‌మానికి స‌హ‌క‌రిస్తున్నార‌ని వెల్ల‌డించారు. అయితే త‌ల‌పిండిన మ‌హేష్‌భ‌ట్‌, క‌ర‌ణ్ జోహార్ లాంటి తిమింగ‌ళాలున్న బాలీవుడ్ క్లీన్ అవ్వ‌డం ఖాయ‌మేనా అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news