Gossips'గీత గోవిందం` కథ విని పారిపోయిన హీరోయిన్లు..!

‘గీత గోవిందం` కథ విని పారిపోయిన హీరోయిన్లు..!

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ ప్రెస్టిజియస్ గా చేసిన సినిమా గీతా గోవిందం. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పరశురాం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన నటించింది. కన్నడ కిర్రాక్ పార్టీ సినిమాతో సౌత్ లో క్రేజ్ సంపాదించిన ఈ అమ్మడు తెలుగులో ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.

ఇక ఇప్పుడు విజయ్ పక్కన గీతా గోవిందం సినిమాలో నటించింది. ఈ సినిమా హీరోయిన్ పాత్రకు చాలామంది హీరోయిన్స్ ను అనుకున్నారట. ముందు కథ తెలిసిన బన్ని ఈ సినిమాలో హీరోయిన్ గా కొంతమందిని రిఫర్ చేశాడట వారెవరు ఈ సినిమా చేయనన్నారట. అంతేకాదు ఈ సినిమా ఆడియో వేడుకలో దర్శకుడు పరశురాం కూడా కూడా హీరోయిన్ గా రష్మికకు రాసిపెట్టుంది అందుకే ఎంతోమందిని అడిగినా ఫైనల్ గా రష్మిక ఓకే చేసిందని అన్నాడు.

మరి హీరోయిన్ గా కాదనడానికి సమస్య ఎక్కడ వచ్చింది అన్నది తెలియలేదు. ఒకవేళ అర్జున్ రెడ్డి తరహాలో ఇందులో కూడా లిప్ లాక్స్ ఉంటాయన్న కాన్సెప్ట్ తో విజయ్ పక్కన నటించేందుకు కాదన్నారా లేక కథలో ఏదైనా ట్విస్ట్ కొద్ది సినిమా వద్దాన్నారా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ ట్విస్ట్ రివీల్ అవ్వాలి అంటే ఆగష్టు 15న సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news