Newsతారక్ "నిన్ను మిస్ అయ్యాను" అంటున్న పూజా..!

తారక్ “నిన్ను మిస్ అయ్యాను” అంటున్న పూజా..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో తన పోర్షన్ మొత్తం పూర్తి చేసుకుని షూటింగ్ కు బై బై చెప్పేసింది పూజా హెగ్దె.

దసరాకి రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో సినిమాను త్వరగా కానిచ్చేస్తున్నారు. సినిమాలో టైటిల్ రోల్ పోశిస్తున్న పూజా ఇంత త్వరగా సెట్స్ ను వదిలి వెళ్లడం షాకింగ్ గానే ఉంది. ఇక వెళ్తూ వెళ్తూ త్రివిక్రం తో సెల్ఫీ దిగింది పూజా.. రోజూ సెట్ కు రావడం ఉత్సాహంగా అనిపించిందని.. ఎన్.టి.ఆర్ నువ్ మిస్సాయ్యావ్ ఈసారి నీతో ఫోటో దిగుతా అంటూ ట్విట్టర్ లో పెట్టింది పూజా.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news