Newsఎన్టీఆర్ తో గొడవ.. గూబ పగిలేలా ఆన్సర్ ఇచ్చిన కమెడియన్..!

ఎన్టీఆర్ తో గొడవ.. గూబ పగిలేలా ఆన్సర్ ఇచ్చిన కమెడియన్..!

ఎన్.టి.ఆర్ తో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి గొడవ గురించి కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇచ్చుకున్నాడు. 2009లో జరిగిన ఓ యాక్సిడెంట్ దగ్గర నుండి వారి మధ్య దూరం పెరిగింది. అయితే ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి విభేధాలు లేవని చెప్పాడు శ్రీనివాస్ రెడ్డి. తారక్ చేస్తున్న అరవింద సమేత సినిమాలో శ్రీనివాస్ రెడ్డి కూడా నటిస్తున్నాడు.

త్రివిక్రం సెట్స్ లో వారిద్దరి మధ్య సఖ్యత లేకపోవడం చూసి డిస్ట్రబ్ అవుతున్నాడని.. అనుకున్న విధంగా షూటింగ్ చేయలేకపోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో శ్రీనివాస్ రెడ్డి, తారక్ తో కలిసి దిగిన ఓ పిక్ ట్విట్టర్ లో పెట్టాడు. ఆ పిక్ లో త్రివిక్రం కూడా ఉన్నాడు. మధురం మధురం ఈ సమయం అంటూ శ్రీనివాస్ రెడ్డి ట్వీట్ చేశాడు. సో శ్రీనివాస్ రెడ్డి ట్వీట్ తో మరోసారి ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news