Newsమహేష్ మాత్రమే కాదు చరణ్ కూడా మిస్సయ్యాడట..!

మహేష్ మాత్రమే కాదు చరణ్ కూడా మిస్సయ్యాడట..!

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా రాబోతున్న ఫిదా మూవీ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చింది. అయితే ఈ సినిమా కథ ఇద్దరు స్టార్ హీరోల దగ్గరకు వెళ్లొచ్చిందని టాక్. లీడర్ టైంలో శేఖర్ కమ్ముల డైరక్షన్ ఇష్టపడ్డ మహేష్ మంచి కథ ఉంటే సినిమా చేద్దాం అనుకున్నాడట. శేఖర్ కమ్ములకు కబురు పంపగా ఓ కథ చెప్పాడట. మహేష్ కు కథ నచ్చినా కొన్ని కారణాల వల్ల చేయలేదని తెలుస్తుంది. ఆ కథ ఏదో కాదు ఫిదా సినిమా కథే అంటున్నారు.

ఇక మహేష్ తర్వాత రాం చరణ్ కు కూడా ఈ కథ వినిపించాడట శేఖర్ కమ్ముల. చరణ్ కు కూడా కథ నచ్చినా స్టార్ ఇమేజ్ ఉన్న హీరో చేయాల్సిన సినిమా కాదని చెప్పాడట. ఇక మహేష్ చరణ్ కాకుండా మరో హీరో కూడా ఈ కథను కాదనేశాడట. ఆ హీరోలు మిస్సైనా సినిమా కథ మాత్రం కచ్చితంగా వర్క్ అవుట్ అవుతుందని అంటున్నారట.

తన టేస్ట్ కు తగ్గ సినిమాలను చేస్తూ వస్తున్నా వరుణ్ తేజ్ కు ఇంతవరకు కెరియర్ లో సరైన కమర్షియల్ హిట్ పడలేదు. ఫిదాతో ఆ కోరిక తీర్చుకోవాలని చూస్తున్నాడు. ఓ పక్క శేఖర్ కమ్ముల కూడా ఈ సినిమా హిట్ తో మళ్లీ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. మలయాళ భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిచారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news