Newsజై లవకుశ స్టోరీ లీక్.. రికార్డులు ఇక వరుస కట్టాల్సిందే..!

జై లవకుశ స్టోరీ లీక్.. రికార్డులు ఇక వరుస కట్టాల్సిందే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కె.ఎస్. రవింద్ర (బాబి) కాంబినేషన్ లో వస్తున్న సినిమా జై లవ కుశ. ఎన్.టి.ఆర్ ట్రిపుల్ రోల్ చేస్తున్నా ఈ సినిమాలో జై, లవ, కుశలుగా తారక్ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ కథ సంచరిస్తుంది. అది నిజమో కాదో తెలియదు కాని బయటకు వచ్చిన స్టోరీ మాత్రం సంచలనం సృష్టిస్తుంది.

జై లవ కుశ ముగ్గురు ఒకే తండ్రి కొడుకులు.. అయితే తల్లులు మాత్రం ఇద్దరు. జై మొదటి భార్య కొడుకు.. రెండో భార్య పిల్లలు లవ కుశ. తన తండ్రి వల్లే తల్లి చనిపోయిందని తండ్రితో పాటుగా అతని కుటుంబం మీద పగ పెంచుకుంటాడు జై. తండ్రితో పాటు లవకుశలు డ్రామా ఆర్టిస్టులుగా పెరుగగా.. జై మాత్రం చిన్నప్పుడే తల్లిని కోల్పోవడంతో చెడు సావాసాలతో విలన్ గా మారతాడట. మొత్తానికి జై, లవకుశ మీద పెంచుకున్న పగ ఎలా తీరిందనేది జై లవకుశ కథ అని అంటున్నారు.

కామెడీ ఎటర్టైనర్ తో పాటుగా తారక్ ఫ్యాన్స్ కు ఈ సినిమా ఓ పండుగ అని అంటున్నారు. అంతేకాదు ఎన్.టి.ఆర్ నట విశ్వరూపాన్ని సినిమాలో చూపించేశాడని టాక్. మూడు క్యారక్టర్స్ లో తారక్ ఎవరు ఊహించని విధంగా కనిపిస్తాడట. ఈ కథ కాస్త పాతగానే ఉన్నా బాబి మార్క్ డైరక్షన్.. ఎన్.టి.ఆర్ మార్క్ నటనతో సినిమా సంచలనంగా మారే అవకాశాలున్నాయి. మరి అసలు కథ ఇదేనా కాదా అన్నది తెలియాలంటే సెప్టెంబర్ 21 దాకా వెయిట్ చేయాల్సిందే. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేథా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆడియో ఆగష్టు 11న రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news