Moviesరజనీకాంత్ , ఎన్టీఆర్ అందరికీ షాక్ ల మీద షాక్ లు!!

రజనీకాంత్ , ఎన్టీఆర్ అందరికీ షాక్ ల మీద షాక్ లు!!

వాళ్లకు షాక్ లు ఇవ్వడం అలవాటే. మనం ఒకటనుకుంటే వాళ్లు ఇంకోటి చేస్తారు. మన ఊహాగానలు వేరు.. సెలబ్రిటీల ఆలోచనలు వేరు. తాజాగా ఈ జాబితాలో చేరారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ రజనీకాంత్. వీళ్లలో రజనీ ఆయన ఇప్పటికే శంకర్ తో రోబో-2 చేస్తూ బిజీగా ఉన్నారు. ఆయన ఇప్పట్లో మరో సినిమా చెయ్యరు అనే అనుకున్నరంతా. రోబో-2 పూర్తయ్యకే మరో సినిమా ఒప్పుకుంటారని సినీ ఇండస్ట్రీ టాక్. అయితే ఆ టాక్ ను బద్దలు కొడుతూ ధనుష్ ఓ ఎనౌన్స్ మెంట్ చేశారు. అదే తమ సొంత బ్యానర్ లో రజనీ మరో మూవీ తీయబోతున్నారని. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ లో ప్రకటించారు కూడా.ఎన్నో అంచనాలతో వచ్చిన కబాలి తర్వాత పా. రంజిత్ కి అవకాశాలే కష్టంగా ఉన్నాయనుకుంటున్న తరుణంలో.. రజనీకాంత్ పిలిచి మరీ మరో అవకాశం ఇవ్వడం నిజంగా సినీ ఇండస్ట్రీ తో పాటు సగటు ప్రేక్షకుడిని సైతం షాక్ కి గురి చేసింది. రోబో-2 తర్వాతే కొత్త మూవీ ఉంటుందనుకున్న ఇండస్ట్రీ వర్గాల అంచనాలను తలకిందులు చేస్తూ రజనీ ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజంగా ఇది షాకింగ్ న్యూసే.

ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికొస్తే.. జనతా గ్యారేజ్ రిలీజ్ కు ముందే హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఆయన తర్వాత సినిమాపై ఎవరి అంచనాలు వాళ్లు వేసుకుంటున్నారు. జూనియర్ తర్వాతి సినిమా వక్కతం వంశీ డైరక్షన్ లో ఉంటుందనుకున్నారంతా. ఇది కాకుండా ఒకళ్లిద్దరు డైరెక్టర్స్ కూడా తర్వాతి సినిమాకోసం జూనియర్ తో టచ్ లో ఉన్నారని సమాచారం. కానీ జూనియర్ మాత్రం వంశీ మూవీకే ఓకే చెప్పినట్లు అనుకున్నారు. కానీ ఇంతలోనే ట్విస్ట్ ఇచ్చారు జూనియర్. నెక్స్ట్ మూవీ పూరీ డైరక్షన్ లో చేయాలని దాదాపు నిర్ణయించుకున్నట్లు సమాచారం. పూరీ మూవీని(టెంపర్ 2) సంక్రాంతి బరిలో నిలపాలనేది జూనియర్ ఆలోచనగా చెబుతున్నారు. పూరీ అయితే 2, 3 నెలల్లో సినిమా పూర్తి చేస్తారన్న టాక్ ఉంది. అందుకే పూరీతో డిసెంబర్ కల్లా మూవీ పూర్తి చేసి.. సంక్రాంతి బరిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశముంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news