Gossipsహీరోయిన్ పై ఫ్యాన్స్ దాడి.. తట్టుకోలేక ఇల్లు ఖాళీ చేసిన అమ్మడు..!

హీరోయిన్ పై ఫ్యాన్స్ దాడి.. తట్టుకోలేక ఇల్లు ఖాళీ చేసిన అమ్మడు..!

కన్నడ నటి రమ్యకు అక్కడ స్టార్ హీరో అంబరీష్ ఫ్యాన్స్ నుండి విపరీతమైన ట్రోల్స్ జరుగుతున్నాయి. కన్నడలో స్టార్ హీరో అయిన అంబరీష్ ఈమధ్య మరణించడం జరిగింది. అయితే ఆయన మృతి పట్ల తన నివాళి అర్పించిన రమ్య ఆయన్ను చివరి సారిగా చూసేందుకు మాత్రం వెళ్లలేదు. చిరంజీవి, రజినికాంత్, మోహన్ బాబు లాంటి స్టార్స్ అందరు అంబరీష్ ను చివరిసారి చూసేందుకు వెళ్లారు. అక్కడ నుండి హీరోయిన్ గా ఎదిగి పొలిటిషియన్ గా మారిన రమ్య మాత్రం వెళ్లలేదు. అయితే అందుకు ఆమెను ట్రోల్స్ తో ఆడుకుంటున్నారు అంబరీష్ ఫ్యాన్స్.
2
తమ అభిమాన నటుడిని ఆఖరి చూపు చూసేందుకు నీకు తీరిక లేదా అంటూ విపరీతమైన కామెంట్స్ పెట్టారట. అంబరీష్ అభిమనుల తాకిడికి రమ్య ఏకంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయిందని తెలుస్తుంది. కర్ణాటకలోని మ్యాండ్యలో ఆమె నివాసం ఉంటుంది. కొన్నాళ్లుగా అక్కడే రెంట్ కు ఉంటున్న రమ్య రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిందట. తనపై వస్తున్న ట్రోల్స్ తప్పించుకునేందుకే ఇల్లు ఖాళీ చేసిందని అంటున్నారు. ఆన్ లైన్ లో ట్రోల్స్ కు ఇల్లు మారడం ఏంటన్న లాజిక్ అర్ధం కావడం లేదు.
1
అంతేకాదు పొలిటికల్ గా అమ్మడికి ఈసారి కాంగ్రెస్ మొండిచెయ్యి చూపించిందట. ఎంపి టికెట్ ఆశించిన అమ్మడికి ఇచ్చేది లేదని చెప్పారట. అందుకే రమ్య ఇల్లు మార్చిందని అంటున్నారు. ఇక ఎలాగు పొలిటికల్ గా కష్టమే అనుకుంది కాబోలు మళ్లీ సినిమాల మీద ఫోకస్ పెడుతుందట రమ్య. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసిన రమ్య మరోసారి సిని కెరియర్ మీద దృష్టి పెట్టింది. మరి రీ ఎంట్రీలో రమ్యకు ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news