Moviesరికార్డు ధర పలికిన రజిని 2.0

రికార్డు ధర పలికిన రజిని 2.0

సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 2.0 మూవీ తెలుగు రైట్స్‌ భారీ ధర పలికాయి. గ్లోబల్ సినిమాస్ అనే తెలుగు సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 2.0 తెలుగు హక్కులని భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే, ఆ మొత్తం ఎంత అనే వివరాలు మాత్రం ప్రస్తుతానికి గోప్యంగానే వుంచింది తమిళంలో ఈ సినిమాను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. తెలుగు హక్కులు అధిక ధరకి అమ్ముడైన విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం ట్విటర్ ద్వారా తెలిపాడు.

వచ్చే ఏడాది 2018న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ద్వారా తొలిసారిగా ఓ దక్షిణాది సినిమాతో సౌతిండియా ఆడియెన్స్‌కి పరిచయం అవుతున్నాడు అక్షయ్ కుమార్. అందులోనూ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించి కరెక్ట్ ఛాయిస్ వస్తే, ఎటువంటి పాత్ర పోషించడానికైనా తాను సిద్ధమే అని నిరూపించాడు అక్షయ్ కుమార్. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రజినీకాంత్ సరసన అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటించింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాదే సెట్స్‌పైకి వెళ్లింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news