Gossipsజై లవ కుశ లో నందమూరి హీరోల 'మనం'.. ఆ కాన్సెప్ట్...

జై లవ కుశ లో నందమూరి హీరోల ‘మనం’.. ఆ కాన్సెప్ట్ కి ఫాన్స్ ఫిదా!!

 

నందమూరి అంటే ఏంటో చూపించడానికి ఎన్టీఆర్ రెడీ అవుతున్నాడు. 2009లోనే నందమూరి ఫ్యామిలీతో పూర్తిగా కలిసిపోయాడు ఎన్టీఆర్. కానీ రాజకీయంగా ఎన్టీఆర్‌ని ఉపయోగించుకున్న చంద్రబాబు….ఆ తర్వాత మాత్రం లోకేష్‌కి పోటీ అవుతాడన్న ఉద్ధేశ్యంతో ఎన్టీఆర్‌ని దూరం పెట్టేశాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం రాజకీయంగా తనకు ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి అనే విషయం ఎప్పుడూ చెప్పలేదు కానీ కుటుంబసంబంధాల విషయంలో మాత్రం నందమూరి కుటుంబ సభ్యులు అందరికీ దగ్గరగా ఉండాలని అనుకున్నాడు. ఆ తర్వాత నుంచీ చేసిన కొన్ని ప్రయత్నాల తర్వాత హరికృష్ణ ఫ్యామిలీకి మాత్రం చాలా దగ్గర అయిపోయాడు. మరీ ముఖ్యంగా కళ్యాణ్ రామ్ అయితే ఇప్పుడు ఎన్టీఆర్‌కి భక్తుడే. ఎన్టీఆర్‌ని ఆ స్థాయిలో ఇష్టపడతాడు.

ఇక ఇప్పుడు నందమూరి తారకరామారావు ఆర్ట్స్‌ని నిలబెట్టడం కోసమే జైలవ కుశ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్.ఈ బేనర్‌కి స్వర్గీయ నందమూరి తారక రామారావుకి ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఈ సినిమాలో నందమూరి కుటుంబ సభ్యుల అందరినీ ఇన్వాల్స్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు ఎన్టీఆర్. బేనర్ టైటిల్స్ టైంలోనే నందమూరి కుటుంబాన్ని మొత్తాన్ని చూపించే ప్రయత్నం చే్స్తున్నాడట. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్, హరికృష్ణలు గెస్ట్ రోల్స్‌గా నటిస్తారట. బాలయ్యను కూడా ఈ సినిమాలో ఇన్వోల్వ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే సినిమాలో నందమూరి తారక రామారావు ప్రస్తావన కూడా ప్రత్యేకంగా ఉండేలా స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు కూడా చేస్తున్నారట. ఇకపైన నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై నిర్మించే అన్ని సినిమాల విషయంలోనే బేనర్ టైటిల్స్ సమయంలోనే నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోలు అన్నీ డిస్‌ప్లే అయ్యేలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారట. మనం లాంటి సూపర్ క్లాసిక్ సినిమాతో చాలా పేరు తెచ్చుకుంది అక్కినేని ఫ్యామిలీ. ఇప్పుడు నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ద్వారా అదే స్థాయి ప్రయత్నాన్ని చేస్తున్నారు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు. నందమూరి అభిమానులకు ఇంతకంటే ఆనందకరమైన న్యూస్ వేరే ఏమైనా ఉంటుందా? నందమూరి తారక రామారావు అన్నా, నందమూరి ఫ్యామిలీ అన్నా తారక్‌కి ఉన్న అభిమానానికి మాత్రం ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news