Newsచైతు, సమంత మధ్యలో మనోజ్.. సోషల్ మీడియా లో రచ్చ రచ్చ...

చైతు, సమంత మధ్యలో మనోజ్.. సోషల్ మీడియా లో రచ్చ రచ్చ ..!

మహానటి సినిమా గురించి ప్రస్థావిస్తూ సమంత, నాగ చైతన్య సరదా ట్వీట్స్ ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేశాయి. అయితే వీరి మధ్యలో డిస్కషన్స్ లో మంచు మనోజ్ వచ్చి చేరి మరింత ఫన్ని చేశాడు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే మహానటి సినిమా అనుభూతిని గుర్తుచేసుకుంటూ సినిమాలో నటించిన టీం అందరిని చూసి చాలా స్పూర్తి పొందానని నాగ చైతన్య ట్వీట్ చేశాడు. మహానటి టీం లో సమంత కూడా ఉండటం విశేషం.

అయితే ఆ ట్వీట్ కు సమంత రిప్లై ఇస్తూ ఓకే ఓకే నువ్వు ఇప్పుడు ఇంటికి రా ప్లీజ్ అంటూ మెసేజ్ పెట్టి ఓ ఏడుస్తున్న ఎమోజిని రిప్లై ఇచ్చింది. ఇక వీరి మధ్యలో మనోజ్ వచ్చి బుక్ అయిపోయావురా బాబాయ్ నా చెల్లెలి చేతిలో అంటూ కామెంట్ పెట్టాడు. ఇక మధ్యలో మరో నెటిజెన్ కలుగచేసుకుని బాబాయ్, చెల్లి ఇదెక్కడి వరుస అని అన్నాడు.

ఇక మనోజ్ దానికి సమాధానంగా ప్రేమగా ఎవరిని ఎలా పిలిచినా పలుకుతారు అంటూ రెస్పాన్స్ ఇచ్చాడు. మొత్తానికి సమంత, చైతు మధ్యలో మనోజ్ ట్వీట్ చాట్ నెటిజెన్లను విశేషంగా ఆకట్టుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news