Gossipsఎన్టీఆర్ క్రేజ్ కు ఇదే సాక్ష్యం.. రెండు గంటలకు పాతిక లక్షలు..!

ఎన్టీఆర్ క్రేజ్ కు ఇదే సాక్ష్యం.. రెండు గంటలకు పాతిక లక్షలు..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేయడం కొత్తేమి కాదు టెంపర్ నుండి ఫుల్ ఫాంలో ఉన్న తారక్ ప్రస్తుతం త్రివిక్రం డైరక్షన్ లో అరవింద సమేత సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మెగా నందమూరి కాంబినేషన్ లో మూవీ కూడా లైన్ లో ఉంది. టాలీవుడ్ లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎన్.టి.ఆర్ సినిమాలే కాదు స్పెషల్ ఈవెంట్ లకు వస్తుంటాడు.

ముఖ్యంగా బుల్లితెర ఆడియెన్స్ కోసం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇక లేటెస్ట్ గా ఈటివి డ్యాన్స్ షో కోసం అతిథిగా వచ్చిన తారక్ రెండు గంటల కోసం పాతిక లక్షల రెమ్యునరేషన్ అందుకున్నాడట. దీనిలో ఎన్.టి.ఆర్ డిమాండ్ ఏమి లేదట ఎన్.టి.ఆర్ వస్తే టి.ఆర్.పి దద్దరిల్లు తుంది అందుకే గెస్ట్ గా వచ్చినందుకు షో తరపునుండి తారక్ రెమ్యునరేషన్ ఇచ్చారట.

ఇక ఢీ-10 ఫైనల్స్ లో ఎన్.టి.ఆర్ ఎంట్రీ ఆ ఫైనల్ ఎపిసోడ్ కే అద్భుతమైన సీన్. రాజు విన్నర్ అయిన డ్యాన్స్ షోలో ఎన్.టి.ఆర్ మాటలు, డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులు పండగ చేసుకునేలా చేశాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news