Gossipsహరికృష్ణ మరణంతో..నారా, నందమూరి కుటుంబం కలయిక (వీడియో)

హరికృష్ణ మరణంతో..నారా, నందమూరి కుటుంబం కలయిక (వీడియో)

ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. నల్గొండ జిల్లా అన్నెపర్తిలో ఈ ప్రమాదం జరుగగా దగ్గరలో ఉన్న నార్కెట్ పల్లి కామినేని హాస్పిటల్ కు హరికృష్ణను తీసుకొచ్చారు. అయితే అప్పటికే కొన ఊరితో ఉన్న ఆయన హాస్పిటల్ కు తీసుకు వచ్చేలోపే తుదిశ్వాస విడిచారు.

తండ్రి మరణవార్త విని ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం నార్కెట్ పల్లి చేరుకున్నారు. అక్కడకు ఏపి సిఎం చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ కూడా రావడం జరిగింది. కొన్నాళ్లుగా హరికృష్ణ, చంద్రబాబు దూరం ఉంటుండగా.. హరికృష్ణ, ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం లను బాలకృష్ణ దూరం పెట్టాడు. అయితే అన్న మరణవార్త విని వెంటనే కామినేని హాస్పిటల్ కు వచ్చి కన్నీరు పెట్టుకున్నారు బాలకృష్ణ.
99

హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన స్పెషల్ రూం లో ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం లతో పాటుగా నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ కూడా ఉన్నారు. ఎన్నాళ్ల నుండో ఈ కలయిక కోసం నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నా ఇలాంటి సందర్భంలో వారు కలవడం కాస్త ఇబ్బంది కరంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక నుండైనా నందమూరి ఫ్యామిలీ అంతా ఒక్కటేలా కనిపిస్తుందా లేదా అన్నది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news