Gossips2 .0 ఒక విధ్వంసం అంటూ మహేష్ షాకింగ్ ట్విట్ !

2 .0 ఒక విధ్వంసం అంటూ మహేష్ షాకింగ్ ట్విట్ !

రజినీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘2.0’. దర్శకుడు శంకర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ తో హాలీవుడ్ సినిమా కి ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమాను తెరకెక్కించారు. అంతే కాదు రోబో కి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీలో రజనీ యాక్షన్ , ప్రతినాయకుడి పాత్రలో నటించిన బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటన హైలెట్ గా నిలవొబోతున్నట్టు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డ్స్ బద్దలుకొట్టే అవకాశం కనిపిస్తోంది.

తాజాగా… ఈ సినిమాపై టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు స్పందించారు. ఈ సినిమా విజువల్స్ , కాన్సెప్ట్ అదిరిపోయాయి. చిట్టి చేసే విధ్వంసాన్ని స్క్రీన్‌ పై చూసేందుకు ఎదురుచూస్తున్నా…. శంకర్, రజనీకాంత్ సార్, అక్షయ్ కుమార్, ఏఆర్ రెహ్మాన్, మీ టీమ్ మొత్తానికీ అభినందనలు అంటూ మహేష్ బాబు వ్యాఖ్యానించారు. ఇక మహేష్ బాబు ట్వీట్‌ పై అక్షయ్ కుమార్ స్పందించారు. దీన్ని రీట్వీట్ చేసిన అక్షయ్ ‘కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.

ఇటీవల విడుదలైన ‘2.0’ ట్రైలర్‌ని చూసి ఫిదా అయినట్లు మహేష్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. సినీ అభిమానులు ఈ సినిమా గురించి ఉహించుకున్నారో, అంతకంటే ఎక్కువ విసువల్ ఎఫెక్ట్స్ ట్రైలర్లో కనిపించడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. వెండి తెర మీద ఈ సినిమా చూసేందుకు అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news