Gossipsవిండీస్ ను చిత్తు చేసి 3 - 1 తో ...

విండీస్ ను చిత్తు చేసి 3 – 1 తో సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్..

ఈ రోజు తిరువనంతపురం లో జరిగిన చివరి వన్ డే లో భారత్ విండీస్ నిర్ధేశించిన 104 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కోల్పోయి సాధించి అయిదు మ్యాచ్ ల సిరీస్ ని సొంతం చేసుకుంది.
2
ఈ సిరీస్ లో కోహ్లీ మొదటి మ్యాచ్ నుండి చివరి మ్యాచ్ వరకు అదిరిపోయే రేంజ్ లో ఆడాడు, మొత్తం మూడు సెంచరీలు కొట్టి, మూడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లను కైవసం చేసుకున్నాడు. మ్యాన్ అఫ్ ది సిరీస్ రేస్ లో కూడా కోహ్లీనే ఉండటం విశేషం. ఇదే స్పీడ్ లో టీం ఇండియా ముందుకు వెళ్తే విండీస్తో జరగబోయే టీ 20 సిరీస్, అలాగే ఆస్ట్రేలియాతో జరగబోయో సిరీస్ గెలుచు కోవడం పెద్ద కష్టం కాదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
1
ఇక 105 పరుగుల లక్ష్యంతో బరి లోకి దిగిన భారత్ అది లోనే ధావన్ (6 ) వికెట్ కోల్పోయింది. భారత్ 14 . 5 ఓవర్లలో 105 పరుగులు చేసింది. క్రిజులో రోహిత్ శర్మ ( 63 ), కోహ్లీ ( 33 ) పరుగులతో మరో వికెట్ పడకుండా లక్ష్యాన్ని ఛేదించారు.
111

222

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news