Gossipsవంశిపై భానుప్రియ సంచలన వ్యాఖ్యలు..!

వంశిపై భానుప్రియ సంచలన వ్యాఖ్యలు..!

టాలీవుడ్ లో 90వ దశకంలో స్టార్ హీరోల సరసన నటించింది భానుప్రియ. స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ అయిన భానుప్రియకు టాలీవుడ్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. టాలీవుడ్ కి భాను ప్రియను పరిచయం చేసింది ప్రముఖ దర్శకులు వంశి. సుమన్ హీరోగా ‘సితార’సినిమాతో భానుప్రియ హీరోయిన్ గా తెరపై కనిపించింది. వంశి-భాను ప్రియ కాంబినేషన్ లో అన్వేషణ, ఆలాపన వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాలు భానుప్రియ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. అప్పట్లో వంశి, భాను ప్రియల మద్య అఫైర్లు ఉన్నాయని తెగ వార్తలు వచ్చేవి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాను ప్రియ మాట్లాడతూ..నన్ను వెండి తెరకు పరిచయం చేసిన దర్శకులు వంశి..ఆయనతో మరికొన్ని సూపర్ హిట్ సినిమాల్లో నటించాను. మా కాంబినేషన్ మంచి సక్సెస్ సాధించడంతో మా మద్య అఫైర్లు ఉన్నాయని అప్పట్లో పెద్ద రూమర్ పుట్టుకొచ్చింది. అంతే కాదు ఆ సమయంలో వంశీ తనను పెళ్లి చేసుకుంటానని అడిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు భానుప్రియ. ఇంట్లో చెబితే దానికి భానుప్రియ తల్లి ఒప్పుకోలేదట. అప్పటికే వంశీ పెళ్లై, పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయం తెలిసి మా అమ్మగారు చాలా సీరియస్ కూడా అయ్యారు.

కొంత కాలం తర్వాత సినిమాకు దూరంగా ఉంటూ వచ్చానని..అమెరికాలో స్థిరపడిన ఫోటోగ్రాఫర్ ఆదర్శ్ కౌశల్ ని వివాహం చేసుకున్నానని..మాకు ఒక పాప పుట్టిందని..కొంత కాలం తర్వాత కౌశల్ తో అభిప్రాయ భేదాలు రావడంతో ఇండియా వచ్చేశానని అన్నారు. ప్రస్తుతం కొన్ని క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తున్నారు భానుప్రియ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news