Newsఆ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం లావ‌ణ్య‌ను రిక‌మెండ్ చేసిన వ‌రుణ్‌.....

ఆ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం లావ‌ణ్య‌ను రిక‌మెండ్ చేసిన వ‌రుణ్‌.. ఆ టాప్ సీక్రెట్ ఇదే..!

టాలీవుడ్ ప్రేమ పక్షులు మెగా హీరో వరుణ్ తేజ్ – సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి ఎట్టకేలకు భార్యాభర్తలు అయ్యారు. దాదాపు ఆరు సంవత్సరాలుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. వేదమంత్రాలు సాక్షిగా లావణ్య మెడలో వరుణ్ మూడు ముళ్లు వేసి తన భార్యను చేసుకున్నాడు. 2017లో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ సినిమాలో వీరిద్దరూ తొలిసారిగా నటించారు. ఆ సినిమా షూటింగ్ ఇటలీలో జరిగినప్పుడు వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.

అలా ఆరేళ్లపాటు సీక్రెట్ గా ప్రేమ మెయింటెన్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు 2023 లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మిస్టర్ సినిమాతో స్నేహితులుగా మారి ఆ టైంలోనే ప్రేమలో పడ్డ వీరిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి వచ్చేసారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి మరోసారి అంతరిక్షం సినిమాలోని నటించారు. ఆ టైంలో వీరి ప్రేమ మరింత బలపడింది.

అంతరిక్షం సినిమాలో హీరోయిన్గా లావణ్యను – వరుణ్ తేజ్ స్వయంగా రెకమెండ్ చేశాడు అన్న గుసగుసలు కూడా ఉన్నాయి. అప్పటికే ఆమె ప్రేమలో మునిగి తేలడంతో ఆమెతో గడిపేందుకు.. ఆమెను మరింత ఇష్టంగా ప్రేమించేందుకు అంతరిక్షం సినిమాలో లావణ్యను హీరోయిన్‌గా పెట్టాలని దర్శక నిర్మాతలకు సూచించాడని అంటారు.

వరుణ్ సూచన మేరకే ఆ సినిమాలో ఆమెను హీరోయిన్గా తీసుకున్నారు అన్న గుసగుసలు టాలీవుడ్ లో ఉన్నాయి. ఇక తమ ప్రేమకు సాక్ష్యంగా నిలిచిన ఇటలీలోనే ఈ జంట పెళ్లి చేసుకున్నారు. లావణ్య సొట్టబుగల‌ను చూసి మురిసిన వ‌రుణ్ అలా ప్రేమలో పడిపోయాడని అంటారు. ఇక ఈ పెళ్లిలో మెగా ఫ్యామిలీ హీరోలు అందరూ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news