Newsఆ డైరెక్ట‌ర్‌ను పెళ్లి చేసుకుని కెరీర్ నాశ‌నం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్‌..!

ఆ డైరెక్ట‌ర్‌ను పెళ్లి చేసుకుని కెరీర్ నాశ‌నం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్‌..!

సూర్య కిరణ్..అన్నపూర్ణ సంస్థలో వచ్చిన సత్యం సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో వసూళ్ళను రాబట్టింది. సుమంత్ జెనిలీయా జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో హాట్ టాపిక్ అయింది. బడ్జెట్ చాలా తక్కువ. కానీ, వచ్చిన వసూళ్ళు మాత్రం 10 రెట్లు. ఇక సత్యం సినిమా తర్వాత హీరో సుమంత్ కెరీర్ అంతంత మాత్రంగా ఉన్నా..జెనీలియా మాత్రం స్టార్ అయింది.

అయితే, ఈ సినిమా దర్శకుడు ఫ్యామిలీ హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి బాగా ఎదుగుతున్న సమయంలో పెళ్లి చేసుకొని అడ్రస్ లేకుండా పోయింది కళ్యాణి. ఈమె అసలు పేరు కావేరి. కానీ, సినిమా కోసం జీవిత రాజశేఖర్ కళ్యాణి గా మార్చారు. తెలుగులో రాజశేఖర్ హీరోగా నటించిన శేషు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో కళ్యాణి తన పర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకుంది.

దాంతో సీనియర్ దర్శకుడు వంశీ కంట్లో పడింది. అలా రవితేజ సరసన ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాలో నటించి హిట్ అందుకుంది. ఆ తర్వాత దొంగోడు, కబడ్డీ కబడ్డీ, ధన 51 లాంటి సినిమాలు చేసింది. అయితే, కళ్యాణికి టాలీవుడ్ లో మంచి కెరీర్ ఉండేది. చాలా సెలెక్టెడ్ గా సినిమాలను ఎంచుకుంటూ సక్సెస్ అందుకుంటున్న సమయంలో తాడూ బొంగరం లేకుండా ఉన్న సూర్య కిరణ్ ని పెళ్లి చేసుకుంది.

ఆ తర్వాత సినిమాలకి దూరం అయింది. కట్ చేస్తే అటు సూర్య కిరణ్ కి దర్శకుడిగా అవకాశాలు లేవు. ఇటు కళ్యాణి హీరోయిన్ గా సినిమాలు చేయడం లేదు. ఆ మధ్య ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది. కానీ, దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎటువైపు నుంచి రాలేదు. ఏదేమైనా కళ్యాణి కెరీర్ మాత్రం సూర్య కిరణ్ వల్లే నాశనం అయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news