Newsనాగార్జున సినిమా రిలీజ్ అంటే చాలు... కాలేజ్ ఎగ్గొట్టి మరి సినిమా...

నాగార్జున సినిమా రిలీజ్ అంటే చాలు… కాలేజ్ ఎగ్గొట్టి మరి సినిమా చూసే స్టార్ హీరో భార్య ఎవరు..?

టాలీవుడ్‌లో ఒకప్పుడు దివంగత న‌టుడు హీరో అక్కినేని నాగేశ్వరరావుకు మహిళా అభిమానుల సంఖ్య విపరీతంగా ఉండేది. అప్పట్లో ఎన్టీఆర్ ఎంత పెద్ద హీరో అయినా కూడా మహిళా అభిమానుల విషయానికి వస్తే ఏఎన్ఆర్ ముందు వరుసలో ఉండేవారు. అందుకే ఆయన మహిళలు, కుటుంబ ప్రేక్షకులు మెచ్చే సినిమాలో ఎక్కువగా చేసేవారు.

ఆయన నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కూడా విశేషంగా మహిళా అభిమానుల ఆదరణ సొంతం చేసుకున్నారు. అప్పట్లో నాగార్జున స్టైల్ కు మహిళా అభిమానులు.. కాలేజ్ అమ్మాయిలు పడి చచ్చేవారు. నాగార్జున సినిమాలు అంటే మహిళలు కాలేజ్ అమ్మాయిలకు వేలం వెర్రిగా ఉండేది. వాళ్ళు కాలేజీలు ఎగ్గొట్టి మరి నాగార్జున సినిమాలు చేసేవారు.

విచిత్రం ఏంటంటే టాలీవుడ్ క్రేజీ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ భార్య స్వాతికి కూడా నాగార్జున అంటే విపరీతమైన ఇష్టం అట. ఆమె కాలేజ్ చదువుతున్న రోజుల్లో నాగార్జున నటించిన మన్మధుడు సినిమా రిలీజ్ అయింది. అప్పుడు కళ్యాణ్ రామ్ భార్య స్వాతి కాలేజ్‌ ఎగ్గొట్టి మరీ మన్మధుడు సినిమా ఫస్ట్ రోజు షో చేసిందట. ఈ విషయాన్ని కళ్యాణ్ రామ్ నాగార్జున‌తో స్వయంగా చెప్పారు.

స్వాతి మీ అభిమాని.. మీ సినిమా రిలీజ్ అయితే చాలు కాలేజీ ఎగ్గొట్టి మరి ఫస్ట్ డే షో చూడాల్సిందే అని చెప్పటంతో వెంటనే నాగర్జున స్వాతికి కంగ్రాట్స్ చెప్పమంటూ కళ్యాణ్ రామ్‌కు చెప్పాడు. ఈ ఎపిసోడ్ అంతా మీలో ఎవరు కోటీశ్వరుడు లో జరిగింది. ఇక ప్రస్తుతం నాగార్జున నా స్వామి రంగా సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా నవంబర్ 24న రిలీజ్ కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news