Newsతండ్రి మ‌ర‌ణం త‌ట్టుకోలేక క‌న్నీళ్ల‌తో దిల్ రాజు ఏం చేశాడంటే... (...

తండ్రి మ‌ర‌ణం త‌ట్టుకోలేక క‌న్నీళ్ల‌తో దిల్ రాజు ఏం చేశాడంటే… ( ఫోటోలు)

టాలీవుడ్‌లో టాప్ డిస్ట్రిబ్యూట‌ర్‌, అగ్ర నిర్మాత దిల్ రాజు ఇంట్లో తాజాగా తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి ( 86 ) అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు టాలీవుడ్ ప్రముఖులు పరామర్శించారు.

కొందరు ఫోన్లో రాజుకు తమ ప్రగాఢ సానుభూతి చెపుతున్నారు. రాజు తండ్రి మరణ వార్త తెలుసుకున్న సీనియర్ నటుడు ప్రకాష్ రాజు స్వయంగా అంత్యక్రియలో పాల్గొన్నారు. ఓవైపు ప్రకాష్ రాజ్ దిల్ రాజుకు ధైర్యం చెబుతున్నా తన బాధ ఆపుకోలేక పోయిన రాజు ప్రకాష్ రాజును వాటేసుకుని బోరున‌ విలపించారు. రాజు తండ్రి మీద తనకున్న ప్రేమను త‌లుచుకొని చిన్నపిల్లాడిలా ఏడ్చేశారు.

రాజు ఇంటికి వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి శ్యాంసుందర్ రెడ్డి పార్టీవ దేహానికి నివాళులు అర్పించారు. రాజు తండ్రి పేరు శ్యాం సుంద‌ర్‌రెడ్డి కాగా… తల్లి పేరు ప్రమీలమ్మ. రాజుకు ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జన్మించిన రాజు పై చదువులు కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు.

ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ముందు డిస్ట్రిబ్యూట‌ర్‌గా కెరీర్‌ ప్రారంభించి.. తర్వాత నిర్మాతగా మరి ఈరోజు టాలీవుడ్ లోనే తిరుగులేని టాప్‌ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. రాజు మొదటి భార్య అనిత 2017 లో గుండెపోటుతో మరణించారు. వీరికి కూతురు హన్షిత ఉంది. తర్వాత ఆయన 2020లో తేజస్విని రెండో పెళ్లి చేసుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news