Moviesబాలయ్య పాన్ ఇండియా ఫిలిం.. క్రేజీ అప్డేట్ వచ్చేసిందోచ్..నా సామీ రంగ...

బాలయ్య పాన్ ఇండియా ఫిలిం.. క్రేజీ అప్డేట్ వచ్చేసిందోచ్..నా సామీ రంగ ఇక కుమ్మి పడేయాల్సిందే..!!

మనకు తెలిసిందే మే 28న 2023 నందమూరి తారక రామారావు గారి శతజయంతి వేడుకలు ఘనంగా జరిగాయి . ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో పాటు ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది నుంచి శతజయంతి వేడుకల కోసం నందమూరి ఫ్యాన్స్ .. టిడిపి సీనియర్ లు ఎంతో స్థాయిలో కష్టపడ్డారు . వీటిలో భాగంగానే ఇటీవల విజయవాడలో భారీ సభ నిర్వహించగా.. రజనీకాంత్ వచ్చి ఆ సభను సూపర్ సక్సెస్ చేశాడు. కాగా తాజాగా హైదరాబాద్లోని కెపిహెచ్ బి గ్రౌండ్స్ లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల పేరిట మరో భారీ సభను నిర్వహించారు టీం.

ఈ క్రమంలోనే ఈవెంట్ కి అనేకమంది సినీ రాజకీయ ప్రముఖులు వచ్చి నందమూరి ఫ్యామిలీతో ఉన్న తమ అనుబంధం గురించి ఓపెన్ అప్ అయ్యారు. ఈ క్రమంలోనే మొదటి నుంచి బాలయ్యకు జాన్ జిగిడి దోస్త్ గా ఉన్న కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి అభిమానులను అట్రాక్ట్ చేశారు . ఈ కార్యక్రమంలోని శివరాజ్ కుమార్ మాట్లాడుతూ ..”ఎన్టీఆర్ ఫ్యామిలీకి తన కుటుంబానికి ఉన్న బాండింగ్ గురించి ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. చిన్నప్పుడు మేము కూడా చెన్నైలోనే పెరిగాము అని.. రోజు స్కూల్ కి వెళ్ళేటప్పుడు చెన్నైలో ఎన్టీఆర్ ఇంటి మీద నుంచి వెళ్లే వాళ్ళమంటూ.. తన చిన్నప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు “.

అంతేకాదు పనిలో పని ఇదే మూమెంట్లో బాలయ్య అభిమానులకు ఒక క్రేజీ అప్డేట్ కూడా ఇచ్చేశాడు . మా నాన్న – ఎన్టీఆర్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అలా నేను బాలయ్య కూడా క్లోజ్ అయిపోయాము. ఏజ్ పరిగే కొద్దీ మా స్నేహం కూడా పెరిగిపోతూ వచ్చింది. ఇప్పుడు నేను బాలయ్య ఫ్రెండ్స్ కాదు బ్రదర్స్ లాంటివాళ్ళు . గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా టైంలో తెలుగు ఎంట్రీ ఇచ్చాను . త్వరలోనే బాలకృష్ణతో ఓ భారీ సినిమాను ప్లాన్ చేయబోతున్నాను అని రివిల్ చేశాడు శివరాజ్ కుమార్ . దీంతో త్వరలోనే బాలయ్య – శివరాజ్ కుమార్ పాన్ ఇండియా ఫిలిమ్ అప్డేట్ రాబోతుంది అని .. అది బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పుకొస్తున్నారు . బాలయ్య పాన్ ఇండియా ఫిలిం అంటే కేక పెట్టాల్సిందే.. బాక్సాఫీస్ బద్దలు అవ్వాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news