MoviesBigg Boss బిగ్ బాస్ చరిత్రలోనే ఇది ఓ సంచలనం.. హౌస్...

Bigg Boss బిగ్ బాస్ చరిత్రలోనే ఇది ఓ సంచలనం.. హౌస్ లోకి విడాకులు తీసుకున్న జంట..!!

తెలుగు టెలివిజన్ షో లో అతి పెద్ద రియాలిటీ షోగా స్టార్ట్ అయిన బిగ్బాస్ ఇప్పటికే ఆరు సీజన్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే ఏడవ సీజన్ ని గ్రాండ్గా లాంచ్ చేయడానికి సిద్ధమయింది . అందుతున్న సమాచారం ప్రకారం ఇన్నాళ్లు బిగ్ బాస్ సీజన్ కి హోస్టుగా చేసిన నాగార్జున ఏడవ సీజన్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది . ఆ ప్లేస్ లోకి టాలీవుడ్ కండల వీరుడు రానా దగ్గుబాటి వచ్చి ఈ సీజన్ ని హోస్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది .

అంతేకాదు ఇప్పటికే సీజన్ సెవెన్ లో పాల్గొనాల్సిన కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైనల్ చేశారని .. మరికొద్ది రోజుల్లోనే వీళ్ళు క్వారంటైన్ కు వెళ్ళబోతున్నారని తెలుస్తుంది . ఈ క్రమంలోనే బిగ్ బాస్ సెవెన్ కి వెళ్ళబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈసారి బుల్లితెర ..వెండి తెర ప్రముఖులతో పాటు ఇద్దరు సామాన్యులకి.. ఇద్దరు యూబ్ ట్యూబర్ లకి చోటు కల్పించినున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు బిగ్ బాస్ సెవెన్ లో యాంకర్ రష్మీ కూడా పాల్గొంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఒక విడాకులు తీసుకున్న జంటను హౌస్ లోపలికి పంపించబోతున్నారట. టాలీవుడ్ స్టార్ సింగర్ గా పేరు సంపాదించుకున్న నోయల్.. ఆయన ఒకప్పటి భార్య నటి ఎస్తేర్. మనకు తెలిసిందే నోయల్.. ఎస్తేర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . కాగా వీరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని వేరువేరుగా బ్రతుకుతున్నారు . ఈ మధ్య కాలంలో పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఎస్తేర్..నోయెల్ పై దారుణమైన కామెంట్స్ చేసింది. ఇలాంటి క్రమంలోనే వీళ్లిద్దరిని హౌస్ లోకి పంపిస్తే టీఆర్పీలు బాగా వస్తాయన్న ఆలోచనతో బిగ్ బాస్ యాజమాన్యం ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news